ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా ? డ‌బ్బులు లేవా ? అయితే ఈ 6 ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా రుణాల‌ను పొంద‌వచ్చు..!

September 9, 2021 10:46 PM

క‌రోనా వ‌ల్ల చాలా మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. దీంతో ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి పూట గ‌డ‌వ‌డం క‌ష్టంగా మారింది. ఆర్థిక స‌మ‌స్య‌లు సరే స‌రి. చిన్న ప‌ని కూడా దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ఏదైనా చిన్నగా వ్యాపారం చేయాల‌నుకునే వారు డ‌బ్బులు లేక‌పోతే చింతించాల్సిన ప‌నిలేదు. కింద తెలిపిన 6 ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా సుల‌భంగా రుణాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ ప‌థ‌కాలు ఏమిటంటే..

ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా ? డ‌బ్బులు లేవా ? అయితే ఈ 6 ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా రుణాల‌ను పొంద‌వచ్చు..!

1. Small Industries Development Bank of India (SIDBI)

ఈ ప‌థ‌కం కింద క‌నీసం రూ.10 ల‌క్ష‌ల నుంచి గ‌రిష్టంగా రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం ఇస్తారు. MSME ల‌కు ఈ రుణ స‌హాయం అంద‌జేస్తారు. తీసుకున్న రుణానికి 36 నెల‌ల వ‌ర‌కు మారటోరియం సౌక‌ర్యం ల‌భిస్తుంది. 10 ఏళ్ల లోపు రుణాన్ని చెల్లించాలి.

2. Credit Guarantee Scheme (UDAAN)

సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా వ్యాపారుల‌కు ఈ ప‌థ‌కం కింద రుణం వ‌స్తుంది. దీని కింద గ‌రిష్టంగా రూ.2 కోట్ల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. ల‌బ్దిదారులు 15 శాతం మొత్తంతో వ్యాపారం ప్రారంభిస్తే 85 శాతం మేర డబ్బును రుణం కింద ఇస్తారు.

3. PM SVANIDHI scheme

ఈ స్కీమ్ చిరు వ్యాపారుల కోసం ఉద్దేశించ‌బ‌డింది. దీని కింద రూ.10వేల రుణం ఇస్తారు. ఏడాది లోగా చెల్లించాలి.

4. Pradhan Mantri Mudra Scheme

ఇందులో 3 ర‌కాల విభాగాల్లో లోన్లు ఇస్తారు. శిశు విభాగం కింద రూ.50వేల లోపు వ‌ర‌కు రుణాల‌ను ఇస్తారు. కిశోర్ విభాగం కింద రూ.50వేల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాన్ని ఇస్తారు. త‌రుణ్ విభాగం కింద రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం ఇస్తారు. అనేక బ్యాంకులు ఈ రుణాల‌ను అందిస్తున్నాయి. బ్యాంకుల‌ను బ‌ట్టి వడ్డీ రేట్లు మారుతాయి.

5. Stand-Up India Scheme

ఈ ప‌థ‌కంలో భాగంగా రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.1 కోటి వ‌ర‌కు రుణాల‌ను ఇస్తారు. అయితే ఈ స్కీమ్ కింద రుణం పొంది వ్యాపారం ప్రారంభిస్తే అందులో భాగ‌స్వాములుగా ఎస్‌సీ, ఎస్టీ విభాగాల‌కు చెందిన వారు ఉండాలి. వారి వాటా 51 శాతంగా ఉండాలి. లోన్ తీసుకున్నాక 7 ఏళ్ల లోపు చెల్లించాలి. అప్ప‌టికి ఇంకా ఏమైనా బాకీ ఉంటే అద‌నంగా మ‌రో 18 నెల‌ల పాటు రుణాన్ని చెల్లించే కాలాన్ని పొడిగిస్తారు.

6. Prime Ministers Rozgar Yojana (PMRY)

ఈ స్కీమ్ కింద 18 నుంచి 35 ఏళ్ల లోపు వ‌య‌స్సు వారు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఎస్సీ, ఎస్‌టీలు, మ‌హిళ‌లు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌, అంగ వైక‌ల్యం ఉన్న‌వారికి అయితే 45 ఏళ్ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుంది. ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఇనిస్టిట్యూట్‌లో ఏదైనా విభాగంలో ట్రేడ్ స‌ర్టిఫికెట్ కోర్సును క‌నీసం 6 నెల‌ల పాటు అయినా చేసి ఉండాలి. ఏడాది ఆదాయం రూ.40వేలు మించ‌రాదు. వీరికి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now