పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ కొందరి జీవితాలు మధ్యలోనే తెగతెంపులు అవుతుంటాయి. అందుకు ఒక్కోసారి భార్యా భర్తల్లో ఎవరో ఒకరు కారణమవుతారు. కొన్ని సార్లు ఇద్దరూ కారణమవుతారు. అయితే ఆ ఇద్దరి విషయంలో భార్యదే పైచేయి అయింది. కానీ ఆమె తన భర్త గురించి చేసిన ఆరోపణలు అన్నీ తప్పుడువేనని తేలడంతో హైకోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి అతనికి, అతని భార్యకు విడాకులను మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని హిసార్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి, అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 2012 ఏప్రిల్ నెలలో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె జన్మించింది. అయితే 2016వ సంవత్సరంలో ఆ మహిళ తన భర్తను విడిచిపెట్టింది. వేరేగా ఉండడం మొదలు పెట్టింది. ఆ వ్యక్తి బ్యాంకు ఉద్యోగి కాగా, ఆమె టీచర్గా పనిచేస్తోంది.
అయితే ఆమె భర్త నుంచి విడిపోయాక అతనిపై వేధింపుల కేసు పెట్టింది. అతను, అతని కుటుంబ సభ్యులు నిత్యం తనను వేధించే వారని చెప్పింది. అయితే విచారణలో మాత్రం అదంతా అబద్ధమని తేలింది. నిజానికి ఆమెను పెళ్లయ్యాక భర్తే బాగా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నత చదువులు చదివించాడు. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. పైగా ఆమే అతన్ని నిత్యం వేధించేది. కుటుంబ సభ్యుల ఎదుట అతన్ని విమర్శించేది.
ఇక భర్త నుంచి విడిపోయేటప్పుడు ఆమె తన కుమార్తెను కూడా అతని వద్దే వదిలేసింది. అప్పటి నుంచి తన కుమార్తెను చూసేందుకు ఒక్కసారి కూడా ఆమె ముందుకు రాలేదు. కోర్టు ఈ వివరాలను తెలుసుకుంది. ఇక పెళ్లి కాక ముందు తాను 74 కిలోల బరువు ఉండేవాడినని, భార్య పెట్టే టార్చర్ భరించలేక 21 కిలోలు తగ్గానని, దీంతో తన బరువు 53 కిలోలకు చేరుకుందని, తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్దాలేనని అతను కోర్టులో తెలిపాడు. దీంతో తప్పంతా ఆమెదేనని, అతను నిర్దోషి అని, ఏ తప్పు చేయలేదని, అతనిపై అతని భార్య చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని కోర్టు తేల్చింది. దీంతో అతన్ని విడిచి పెట్టడంతోపాటు అతను దరఖాస్తు పెట్టుకున్న విధంగా అతనికి, అతని భార్యకు విడాకులను మంజూరు చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…