పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ కొందరి జీవితాలు మధ్యలోనే తెగతెంపులు అవుతుంటాయి. అందుకు ఒక్కోసారి భార్యా భర్తల్లో ఎవరో ఒకరు కారణమవుతారు. కొన్ని సార్లు ఇద్దరూ కారణమవుతారు. అయితే ఆ ఇద్దరి విషయంలో భార్యదే పైచేయి అయింది. కానీ ఆమె తన భర్త గురించి చేసిన ఆరోపణలు అన్నీ తప్పుడువేనని తేలడంతో హైకోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి అతనికి, అతని భార్యకు విడాకులను మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని హిసార్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి, అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 2012 ఏప్రిల్ నెలలో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె జన్మించింది. అయితే 2016వ సంవత్సరంలో ఆ మహిళ తన భర్తను విడిచిపెట్టింది. వేరేగా ఉండడం మొదలు పెట్టింది. ఆ వ్యక్తి బ్యాంకు ఉద్యోగి కాగా, ఆమె టీచర్గా పనిచేస్తోంది.
అయితే ఆమె భర్త నుంచి విడిపోయాక అతనిపై వేధింపుల కేసు పెట్టింది. అతను, అతని కుటుంబ సభ్యులు నిత్యం తనను వేధించే వారని చెప్పింది. అయితే విచారణలో మాత్రం అదంతా అబద్ధమని తేలింది. నిజానికి ఆమెను పెళ్లయ్యాక భర్తే బాగా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నత చదువులు చదివించాడు. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. పైగా ఆమే అతన్ని నిత్యం వేధించేది. కుటుంబ సభ్యుల ఎదుట అతన్ని విమర్శించేది.
ఇక భర్త నుంచి విడిపోయేటప్పుడు ఆమె తన కుమార్తెను కూడా అతని వద్దే వదిలేసింది. అప్పటి నుంచి తన కుమార్తెను చూసేందుకు ఒక్కసారి కూడా ఆమె ముందుకు రాలేదు. కోర్టు ఈ వివరాలను తెలుసుకుంది. ఇక పెళ్లి కాక ముందు తాను 74 కిలోల బరువు ఉండేవాడినని, భార్య పెట్టే టార్చర్ భరించలేక 21 కిలోలు తగ్గానని, దీంతో తన బరువు 53 కిలోలకు చేరుకుందని, తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్దాలేనని అతను కోర్టులో తెలిపాడు. దీంతో తప్పంతా ఆమెదేనని, అతను నిర్దోషి అని, ఏ తప్పు చేయలేదని, అతనిపై అతని భార్య చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని కోర్టు తేల్చింది. దీంతో అతన్ని విడిచి పెట్టడంతోపాటు అతను దరఖాస్తు పెట్టుకున్న విధంగా అతనికి, అతని భార్యకు విడాకులను మంజూరు చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…