Dates Powder For Sleep : చాలామంది, రాత్రిపూట నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు. మీకు కూడా రాత్రి నిద్ర పట్టట్లేదా..? నిద్ర పట్టడానికి, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే, ఇలా చేయాల్సిందే. చాలామంది, ఈరోజుల్లో మానసిక ఆందోళన మొదలైన ఇబ్బందులకు గురవుతున్నారు. సో, రాత్రి పూట నిద్ర పట్టట్లేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అని చాలామంది స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటున్నారు. కొంతమంది ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నారు. నిద్ర పట్టని వాళ్ళు, ఇలా చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది.
ఈ చిట్కా మంచి నిద్రని అందిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా. ఎండు ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండు ఖర్జూరంతో అనేక లాభాలని పొందవచ్చు. ఎండు ఖర్జూరాలని, 200 గ్రాములు తీసుకుని, ముక్కలు కింద కట్ చేసుకోవాలి.
అలానే, బాదం పప్పుల్ని కూడా 100 గ్రాములు తీసుకోండి. చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని, కట్ చేసుకున్న ఖర్జూరాలని, అలానే బాదం పప్పులు వేసుకోండి. 50 గ్రాములు గుమ్మడి గింజలు, గసగసాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఒక నెల రోజులు పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు, ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో, ఒక స్పూన్ పొడి వేసుకుని తీసుకుంటే, నిద్ర బాగా పడుతుంది.
పైగా పోషకాలు కూడా బాగా అందుతాయి. బాదంపప్పులో ఉండే పదార్దాలు నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే అమైనో ఆమ్లం నిద్ర పట్టేటట్టు చేస్తుంది. గసగసాలు లో మెగ్నీషియం ఉంటుంది. నిద్రలేమి సమస్య ని ఇది దూరం చేస్తుంది. ఇలా నిద్ర పట్టడానికి ఈ పొడి మనకి బాగా హెల్ప్ చేస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…