కొందరు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవ చేసేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. అందువల్లే ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకు ఎల్లప్పుడూ చిన్నచూపు ఉంటుంది. కానీ ఆయన మాత్రం అలా కాదు. ఒక వృద్ధురాలికి ఫించను ఇచ్చేందుకు నెల నెలా ఏకంగా 25 కిలోమీటర్ల పాటు కొండలపై ప్రయాణించి సాహసం చేస్తున్నారు. ఆయనే తమిళనాడుకు చెందిన పోస్ట్ మాస్టర్ ఎస్.క్రీస్తురాజా.
క్రీస్తురాజా వయస్సు 55 ఏళ్లు. తమిళనాడులోని పాపనాశం అప్పర్ డ్యామ్ బ్రాంచ్కు పోస్టు మాస్టర్. ఆయన ఒక్కరే అందులో ఉంటారు. పోస్టాఫీస్ మొత్తాన్ని ఆయనే నిర్వహిస్తారు. అయితే అక్కడి కలక్కడ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కొండ ప్రాంతంలో 110 ఏళ్ల కుట్టియమ్మాల్ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు నెల నెలా రూ.1000 ఫించను వస్తుంది. దాన్ని అందించేందుకు క్రీస్తురాజా నెలకు ఒకసారి ఆదివారం రోజు పర్వతాల్లో 25 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ ఫించను అందిస్తుంటారు.
ఆదివారం అయితే సెలవు కనుక ఆయన నెలలో ఏదైనా ఒక ఆదివారం రోజు ఉదయాన్నే 7 గంటలకు ప్రయాణం అవుతారు. సాయంత్రం వరకు ఆమె వద్దకు చేరుకుంటారు. ఆమెకు ఫించన్ అందజేసి మళ్లీ వెనక్కి వస్తారు. ఇందుకు ఆయనకు ఒక రోజు పడుతుంది. ఆయన వయస్సు 55 ఏళ్లు అయినప్పటికీ ఓ వృద్ధురాలికి ఫించను అందజేయాలనే తలంపుతో ఆయన ఆ సాహసం చేస్తున్నారు. దీంతో అందరూ ఆయనను మెచ్చుకుంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…