బుల్లితెరపై కథ కొన్ని సంవత్సరాల నుంచి టాప్ రేటింగ్ దూసుకుపోతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు గొప్ప స్థాయిలో ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో జడ్జిగా నాగబాబు వ్యవహరించేవారు.కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి నాగబాబు టీమ్ లీడర్ చమ్మక్ చంద్ర తప్పుకున్నారు. ఇక నాగబాబు స్థానంలోకి సింగర్ మను వచ్చారు. జబర్దస్త్ కార్యక్రమం నుంచి నాగబాబు వెళ్లిపోయినప్పటికీ షో రేటింగ్స్ ఏ మాత్రం తగ్గకుండా నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా నాగబాబు వెళ్లిన తర్వాత ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ కూడా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. మరి జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
మంచిగా జడ్జి రోజా విషయానికి వస్తే రోజా ఒక కార్యక్రమానికి సుమారుగా రూ.3 నుంచి రూ.4 లక్షలు తీసుకునేది. నాగబాబు వెళ్లిపోవడంతో ఈమె కూడా వెళ్లకుండా ఉండటం కోసం నిర్వాహకులు అమాంతం ఆమె రెమ్యునరేషన్ రెండింతలు చేశారు. ఈ లెక్కన రోజా నెలకు సుమారు రూ.30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా సింగర్ మను ఒక్కో ఎపిసోడ్ కు రూ.2 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
యాంకర్ అనసూయ మొదట్లో రూ.80 వేల వరకు డిమాండ్ చేసేది. ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ రూ.లక్షకు పై మాటే. అదేవిధంగా యాంకర్ రష్మి నెలకు రూ.4 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక టీం లీడర్స్ విషయానికి వస్తే మొదట్లో రూ.3 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం రూ.నాలుగు లక్షలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా హైపర్ ఆది రూ.3 లక్షలు, అదిరే అభి రూ.రెండు లక్షలు, రాకెట్ రాఘవ రూ.2.75 లక్షలు, బుల్లెట్ భాస్కర్ రూ.2 లక్షలు, చలాకి చంటి రూ.2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే కరోనా ప్రభావం వల్ల వీరి రెమ్యూనరేషన్ ఇప్పుడే పెంచే యోచనలో నిర్వాహకులు లేరని తెలుస్తోంది.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి మరింత రేటింగ్ పెరిగితే వీరి రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…