ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవలే ఓ ప్రత్యేకమైన సేల్ను నిర్వహించిన విషయం విదితమే. అయితే మళ్లీ ఇంకో సేల్ను ఆగస్టు 5 నుంచి నిర్వహించనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఫ్లిప్కార్ట్లో ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక ఆఫర్లను అందివ్వనున్నారు.
ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. సేల్లో రోజూ రాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ప్రత్యేకమైన డీల్స్ ఉంటాయి. అర్థరాత్రి 2 గంటలకు కూడా ప్రత్యేకంగా సేల్లను నిర్వహిస్తారు.
ఈ సేల్లో భాగంగా మోటోరోలా రేజర్ ఫోన్ను రూ.11వేల తగ్గింపు ధరతో రూ.54,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐఫోన్ 11 రూ.5901 తగ్గింపుతో రూ.48,999 ధరకు, అసుస్ ఆర్వోజీ ఫోన్ 3 రూ.7వేల తగ్గింపుతో రూ.39,999 ధరకు, ఐఫోన్ ఎక్స్ఆర్ రూ.8901 తగ్గింపుతో రూ.38,999 ధరకు లభిస్తున్నాయి.
సేల్లో భాగంగా యాపిల్ వాచ్ సిరీస్ 3, ఇతర యాపిల్ వాచ్లను రూ.16,900 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. హానర్ మాజిక్ వాచ్ 2 రూ.3వేల తగ్గింపుతో రూ.9,999 ధరకు లభిస్తోంది. అమేజ్ఫిట్ టి-రెక్స్ వాచ్ రూ.3500 తగ్గింపుతో రూ.6499కు, అమేజ్ఫిట్ జీటీఎస్ రూ.500 తగ్గింపుతో రూ.5499కు లభిస్తున్నాయి.
సేల్లో ట్యాబ్లపై 45 శాతం, స్టోరేజ్ డివైస్లపై 75 శాతం, పవర్ బ్యాంకులపై 70 శాతం, హెడ్ ఫోన్లు, స్పీకర్లపై 70 శాతం, మానిటర్లపై 40 శాతం, బెస్ట్ సెల్లింగ్ టీవీలపై 64 శాతం, ఇతర టీవీలపై 56 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. స్ట్రీమింగ్ డివైస్లను రూ.1645 ప్రారంభ ధరకు, గేమింగ్ ల్యాప్టాప్లను రూ.49,900 ప్రారంభ ధరకు, ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్లను రూ.33,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో రూ.5వేలు ఆపైన విలువైన వస్తువుల కొనుగోలుపై 10 శాతం అదనపు డిస్కౌంట్ను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…