కష్టం ఫలించింది.. వాటర్ ఆపిల్ పండింది!

April 19, 2021 8:21 PM

గ్రీన్ ఆపిల్, కాశ్మీర్ ఆపిల్, కస్టర్డ్ ఆపిల్ గురించి వినే ఉంటాం కానీ.. వాటర్ ఆపిల్ గురించి ఎప్పుడు విని ఉండరు. ఈ వాటర్ ఆపిల్ శాస్త్రీయ నామం సిజియం సమరాంజెన్స్‌. దీనిని రోజ్‌ ఆపిల్‌, గులాబ్‌ జామూన్‌ కాయ అని కూడా పిలుస్తారు. తెలుగులో కమ్మరి కాయలు అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలలో అధికంగా పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా పెరుగుతున్నాయి.

ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన రైతు దంపతులు బల్ల లక్ష్మి, నర్సింగానికి గ్రామంలో మూడు ఎకరాల మామిడి తోటను సాగు చేస్తున్నారు. ఒక రోజు మామిడి మొక్కలు సరఫరా చేసే వ్యక్తి ఈ వాటర్ ఆపిల్ గురించి వారికి చెప్పాడు. దీంతో వారు ఆ మొక్కను తెప్పించి నాటగ కొద్దిరోజులకు అది ఎండిపోయింది. తరువాత మరొక మొక్క తెప్పించి ఎంతో జాగ్రత్తగా దానిని కాపాడి పెంచి పెద్ద చేశారు.

రెండు సంవత్సరాల తర్వాత ఆ చెట్టు పూత పిందెలు వేసి ప్రస్తుతం కాపు కాస్తుంది.లక్ష్మి దంపతులు ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఈ కాయలను కోసి మార్కెట్ తీసుకెళ్తుంటారు.మార్కెట్లో వీటి ధర కిలో 100 నుంచి 150 రూపాయల వరకు పలుకుతుంది. ఒక సీజన్లో  2 క్వింటాళ్లకు పైబడి దిగుబడి అంటే తక్కువలో తక్కువ 26వేల ఆదాయం వస్తుందని ఆ రైతులు తెలిపారు. ఈ వాటర్ ఆపిల్ చూడటానికి గంట ఆకారంలో ఉండి ఎక్కువ భాగం నీరును కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ యాపిల్ లో పోషక పదార్థాలు కూడా అధికంగా ఉండడంతో మార్కెట్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment