Prabhas : పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన బాహుబలి మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పాన్ ఇండియా హీరోగా మారారు. అయితే ప్రభాస్ రీల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకుంటున్నారు. గతంలో కోవిడ్ సమయంలో ఈయన ఎంతో మందికి సహాయం చేశారు. కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. ఇక ఇప్పుడు కూడా ఈయన తన దాన గుణాన్ని మరోమారు చాటుకున్నారు.
ఇటీవలే కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడి కొన్ని వందల మంది చనిపోయారు. ఇంకా రోజు రోజుకీ చాలా మృతదేహాలను బురద నుంచి వెలికి తీస్తున్నారు. అయితే వయనాడ్ బాధితులకు సహాయం అందించేందుకు యావత్ దేశం ముందుకు కదిలింది. ఇప్పటికే చాలా మంది విరాళాలను ప్రకటించారు. అలాగే ప్రభాస్ కూడా వయనాడ్ వరద బాధితులకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అక్కడి సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలియజేశారు.
అయితే ఇదే కాదు.. ప్రభాస్ మరో గొప్ప పని కూడా చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 100 మంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు. వారి చదువులకు అయ్యే ఖర్చులను కూడా ఆయనే భరిస్తున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఓ స్కూల్లో 100 మంది విద్యార్థులను ఆయన చదివిస్తున్నారు. వారి ఫీజులు, ఇతర ఖర్చులకు అయ్యే మొత్తాన్ని ఆయనే ఇస్తున్నారు. ఇలా ప్రభాస్ తన దాన గుణాన్ని చాటుకుంటుండడంపై ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రభాస్ హీరోగా ఇటీవలే విడుదలైన కల్కి 2898ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్గా మన ముందుకు రానున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ అనే మూవీలో నటించనున్నారు. దీంతోపాటు సలార్ 2వ పార్ట్, కల్కి 2వ పార్ట్లోనూ ఆయన నటిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…