Coconut In Aeroplan : విమాన ప్రయాణం ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుంది. అందుకనే సంపన్న వర్గాలకు చెందిన వారు, అప్పర్ మిడిల్ క్లాస్ వారు విమానాల ద్వారా ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. అయితే విమానాల్లో వెళ్లడం వరకు బాగానే ఉంటుంది. కానీ అందులో ఏ వస్తువును పడితే ఆ వస్తువును తీసుకెళ్తానంటే కుదరదు. విమానాల్లో తీసుకెళ్లేందుకు కేవలం కొన్ని రకాల వస్తువులను మాత్రమే అనుమతిస్తారు. కొన్ని వస్తువులకు అనుమతి ఉండదు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టాపిక్ తెర మీదకు వచ్చింది. అదేమిటంటే..
విమానాల్లో కొబ్బరికాయలను తీసుకెళ్లవచ్చా.. లేదా.. అని కొందరు అడిగిన ప్రశ్నలకు విమానయాన సంస్థలు సమాధానాలు ఇచ్చాయి. ఎండిన కొబ్బరిని విమానాల్లో అసలు తీసుకెళ్లకూడదని చెప్పారు. ఎందుకంటే ఎండు కొబ్బరిలో నూనె పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఈ కొబ్బరి త్వరగా మండుతుంది. దీంతో విమానంలో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. కనుక ఎండు కొబ్బరిని విమానాల్లో తీసుకెళ్లకూడదు అని చెప్పారు.
అయితే పచ్చి కొబ్బరిని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకెళ్లవచ్చని చెప్పారు. అలాగే ప్యాక్ చేయబడిన కొబ్బరి అయితే తీసుకెళ్లవచ్చట. ఎందుకంటే కంపెనీలు అన్నీ సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తూ కొబ్బరిని ప్యాక్ చేస్తాయి. కనుక ప్యాక్ చేయబడిన కొబ్బరికి విమానాల్లో అనుమతి ఉంది. ఇక విమానాల్లో తేనెను 100 ఎంఎల్ వరకు తీసుకెళ్లవచ్చు. అదే నీళ్ల బాటిల్ అయితే 100 ఎంఎల్ వరకు అనుమతిస్తారు. శీతల పానీయాలను కూడా 100 ఎంఎల్ వరకు అనుమతిస్తారు.
విమానాల్లో బిర్యానీ, డ్రై కేక్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, డ్రై స్వీట్లను తీసుకెళ్లవచ్చు. చేపలు,మాంసాహారాలు, కొబ్బరి, ఊరగాయలు, బియ్యం, పప్పు దినుసులు, అన్ని రకాల మసాలా పొడులు, కారం పొడి వంటి వాటిని విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించరు. కనుక ఈ విషయాలను ప్రయాణికులు ముందుగానే తెలుసుకుంటే విమానం ఎక్కే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదంటే మీరు తెచ్చిన ఆ వస్తువులను ఎయిర్పోర్టులోనే విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…