Banana Leaf Cutting : ఇప్పుడంటే చాలా మంది భోజనం చేసేందుకు స్టీల్ లేదా ప్టాస్టిక్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో చాలా మంది మట్టి పాత్రలు లేదా అరటి ఆకులను భోజనం చేసేందుకు ఉపయోగించేవారు. ఇప్పటికీ మనం బయటకు వెళితే కొన్ని రెస్టారెంట్లలో మనకు అరటి ఆకుల్లోనే భోజనం వడ్డిస్తుంటారు. అయితే అరటి ఆకుల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి.
అరటి ఆకుల్లో ఉండే అనేక పోషకాలు మనకు భోజనం ద్వారా లభిస్తాయని వైద్యులు చెబుతుంటారు. అలాగే విషాహారం గనక అరటి ఆకుల్లో ఉంటే ఆకులు నీలి రంగులోకి మారుతాయని, దీంతో మనం విషాహారం తినకుండా ప్రాణాలను రక్షించుకోవచ్చని కూడా చెబుతారు. అయితే అరటి ఆకులను చాలా మంది అలాగే ఉంచి వాటిల్లో భోజనం చేస్తారు. కానీ కొన్ని రెస్టారెంట్లు భిన్న రకాల షేపుల్లో కట్ చేసిన అరటి ఆకులను తమ కస్టమర్ల కోసం ఉపయోగిస్తుంటాయి. ఈ క్రమంలోనే దీని ప్రాతిపదికన చాలా మంది అరటి ఆకులను అమ్మే వ్యాపారాలను కూడా చేస్తున్నారు.
ఇక తాజాగా అలాంటి ఓ అరటి ఆకులను అమ్మే చోట తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో కొందరు వ్యక్తులు అరటి ఆకులను భిన్న ఆకారాల్లో కట్ చేస్తుండడాన్ని గమనించవచ్చు. కొందరు అరటి అరటి ఆకులను రెండుగా చీల్చి ప్యాక్ చేస్తుంటే, ఇంకొందరు చదరం ఆకారంలో వాటిని కట్ చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఒక ప్లేట్ సహాయంతో ఆకులను వృత్తాకారంలో కట్ చేస్తుండడాన్ని మీరు గమనించవచ్చు. అయితే ఓ వ్యక్తి ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్గా మారింది. దీన్ని ఇప్పటికే 27.7 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.
ఈ వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. అరటి ఆకుల్లో తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని కట్ చేయడం ఎందుకు. ఆకులను అలాగే ఉంచి కడిగి వాటిలో తినవచ్చు కదా. కట్ చేయడం వల్ల వేస్టేజ్ ఎక్కువగా వస్తుంది.. అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా అరటి ఆకులను విక్రయించే వ్యాపారం అయితే చాలా బాగుంది కదా. దీన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకుని మంచి లాభాలను సంపాదించవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…