Brain After Death : మనిషి చనిపోయిన తరువాత అసలు ఏం జరుగుతుంది..? అన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఒక మనిషిలో ఉండే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని రోజులకు మరో జీవిలో ప్రవేశిస్తుందని చెబుతారు. దీంతో ఆ వ్యక్తికి పునర్జన్మ లభిస్తుంది. గత జన్మలో ఆ మనిషి చేసిన పాప పుణ్యాలకు అనుగుణంగా మరుసటి జన్మ ఉంటుందని చెబుతారు. ఇక నిత్యం దైవ ప్రార్థన చేసేవారికి, ఆధ్యాత్మిక భావాలను ఎక్కువగా కలిగి ఉన్నవారికి మళ్లీ జన్మ ఉండదని అంటారు.
అయితే చనిపోయిన తరువాత మనిషి శరీరంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. కానీ మరణానంతరం శరీరంలో కొన్ని అవయవాలు అయితే పనిచేస్తాయని మాత్రం వైద్యులు ఇప్పటికే నిర్దారించారు. ఇక మనిషి చనిపోయిన తరువాత సుమారుగా 7 నిమిషాల పాటు మెదడు పనిచేస్తుందని కూడా వైద్యులు నిర్దారించారు. అయితే ఆ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది ? అనే విషయాన్ని మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోయారు.
కానీ కొందరు సైంటిస్టులు ఇదే విషయమై పరిశోధనలు చేశారు. పూర్తిగా కాదు కానీ.. చూచాయగా మాత్రం ఈ విషయం గురించి తెలుసుకున్నారు. మనిషి చనిపోయిన తరువాత 7 నిమిషాల పాటు మెదడు పనిచేస్తుందని, మొదటి నిమిషంలో మనిషి తన పుట్టిన రోజును గుర్తు చేసుకుంటాడని చెప్పారు. అలాగే రెండో నిమిషంలో ఆ మనిషికి సంతోషకరమైన క్షణాలు, స్నేహితులు గుర్తుకు వస్తారట. మూడో నిమిషంలో మొదటి, చివరి ప్రేమ గుర్తుకు వస్తాయట. 4వ నిమిషంలో విచార జ్ఞాపకాలు, ఒంటరి క్షణాలు, 5వ నిమిషంలో అద్భుత క్షణాలు, 6వ నిమిషంలో ఇతరులకు చేసిన మంచి, చెడు పనులు గుర్తుకు వస్తాయట. అయితే 7వ నిమిషంలో ఏం జరుగుతుందో మాత్రం పరిశోధకులు కాప్చర్ చేయలేకపోయారట. ఇలా వారు తమ పరిశోధనల వివరాలను వెల్లడించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…