మణిరత్నం-విజయ్ సేతుపతి మూవీలో సాయిపల్లవి.. ధనుష్ ప్లేస్‌లోకి ‘మక్కల్ సెల్వన్’!

త‌మిళ న‌టుడు విజయ్ సేతుప‌తితో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న సినిమాలో న‌టి సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సాయిప‌ల్ల‌విని ఈ సినిమాకు మ‌ణిర‌త్నం ఓకే చేశార‌ని స‌మాచారం.

February 23, 2026 6:21 PM
Sai Pallavi and Vijay Sethupathi in Mani Ratnam's next romantic film.
మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జోడీ. Photo Credit: Sai Pallavi/Instagram.

త‌మిళ న‌టుడు విజయ్ సేతుప‌తితో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న సినిమాలో న‌టి సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సాయిప‌ల్ల‌విని ఈ సినిమాకు మ‌ణిర‌త్నం ఓకే చేశార‌ని స‌మాచారం. సినిమా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టించేందుకు సాయిప‌ల్ల‌వి కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు గాను ముందుగా విజయ్ స్థానంలో ధ‌నుష్‌ను అనుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో తేడా వ‌చ్చి ధ‌నుష్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలిసింది. అయితే ఎట్ట‌కేల‌కు విజ‌య్ సేతుప‌తిని ఈ సినిమాకు లీడ్ రోల్‌లో తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌విని ఈ సినిమాకు ఫీమేల్ లీడ్‌గా మ‌ణిర‌త్నం ఎంపిక చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న సాయిప‌ల్ల‌వి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింద‌ని సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో ఆమె ఇక‌పై వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

విజ‌య్ సేతుప‌తికి మ‌ణిర‌త్నంతో రెండో మూవీ..

థ‌గ్ లైఫ్ మూవీ నిరాశ ప‌రిచిన అనంత‌రం ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించాల‌నుకున్న ఈ మూవీకి అస‌లు ధ‌నుష్, విజ‌య్ సేతుప‌తి కంటే ముందుగా కూడా ప‌లువురు న‌టుల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది. దీనికి మ‌ణిర‌త్నం ముందుగా త‌మిళ నటుడు శింబును హీరోగా అనుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌రువాత కొంత కాలం పాటు ధ్రువ్ విక్ర‌మ్ పేరు కూడా వినిపించింది. కానీ చివ‌ర‌కు విజ‌య్ సేతుప‌తిని మ‌ణిర‌త్నం ఓకే చేశారు. దీంతో విజ‌య్ సేతుప‌తికి మ‌ణిర‌త్నంతో ఇది రెండో సినిమా కానుంది. అంత‌కు ముందు మ‌ణిర‌త్నంతో విజ‌య్ చీక్కా చివంత వాన‌మ్ అనే మూవీని చేశారు. ఇక విజ‌య్ సేతుప‌తిని మెయిన్ లీడ్ రోల్‌కు తీసుకున్న అనంత‌రం మ‌ణిర‌త్నం ముందుగా రుక్మిణి వ‌సంత్‌ను సంప్ర‌దించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆయ‌న సాయిప‌ల్ల‌విని ఓకే చేసిన‌ట్లు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది. ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిన‌ట్లు తెలిసింది. ఇక దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్నారు.

ఇప్ప‌టికే బాలీవుడ్ లో బిజీగా సాయిప‌ల్ల‌వి..

మ‌ణిర‌త్నం, విజ‌య్ సేతుప‌తి మూవీకి ఏఆర్ ర‌హ‌మాన్ సంగీతం అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వ‌చ్చే నెల‌లో అధికారికంగా ప్రారంభించ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది. లైకా ప్రొడ‌క్ష‌న్ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. ఈ వివ‌రాల‌న్నింటిపై త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌ట‌న రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే సాయిప‌ల్ల‌వి ఇప్ప‌టికే బాలీవుడ్‌లో అనేక సినిమాలతో బిజీగా ఉంది. ఆమె హిందీలో ఏక్ దిన్ అనే మూవీలో మీరా అనే పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, రామాయ‌ణ పార్ట్ 1, 2 మూవీల్లో సీత‌గా చేస్తోంది. త‌మిళంలో డీ55 అనే సినిమాలోనూ ఆమె యాక్ట్ చేస్తుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక తాజాగా ఇప్పుడు మ‌ణిర‌త్నం సినిమా కూడా ఆమె చేతిలోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇది క‌న్‌ఫామ్ అయితే వ‌చ్చే 3 ఏళ్ల‌లో సాయిప‌ల్ల‌వి పేరు దేశ‌వ్యాప్తంగా సినిమా ఇండ‌స్ట్రీలో మారుమోగి పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment