Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ షోపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ షో గురించి శ్రీ రెడ్డి, మాధవీలత వంటి వారు విమర్శలు ఎక్కుపెట్టగా, రీసెంట్గా యాంకర్ రవి తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలని పిలిచి తీసుకెళ్లారు. కానీ ఆ హోదా ఇవ్వలేదు. మీరు ఇచ్చేది ఏంటి.. వీళ్లు ఇస్తున్నారు చాలు. అది రెస్పెక్ట్ అంటే.. అంటూ అక్కడే ఉన్న ఫ్యాన్స్ను చూపించింది. ప్రస్తుతం రవి తల్లికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన అనంతరం అతడి ఫ్యాన్స్ డ్యాన్స్ డీజేతో గ్రాండ్గా వెల్కం చెప్పారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మీడియాతో రవి తల్లి ఉమా రాణి నా కొడుకు ప్రెషర్ కుక్కర్ నుంచి బయట పడినట్టు ఉందని చెప్పింది. అంతేగాక రవిని వాళ్లు ఎన్కౌంటర్ చేసినట్టు అనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా కొడుకు టాప్ 5లో ఉండాల్సిన వాడు ఇలా ఎలిమినేట్ అవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గేమ్ ఆడాడు. పిచ్చి చేష్టలు చేసి రాలేదు. ఊరికే కూర్చోని తినలేదు. రవి గేమర్. తెలివిగా ఆడాడు.. అని చెప్పుకొచ్చింది.
‘సెలబ్రెటీలను పట్టుకు తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు. అదే ఇండస్ట్రీలో ఉంటూ సేమ్ ఇండస్ట్రీ వారిని అవమానిస్తున్నారు. రవి అనే కాదు ప్రతి కంటెస్టెంట్కు ఇది ఫెయిర్ కాదు. ఇది ఎప్పటికీ సరైనది కాదు. ఇప్పటికైనా కాన్సెప్ట్ మార్చండి. లేకపోతే బిగ్బాస్ ఎవరూ చూడరు.. అంటూ రవి తల్లి ఉమరాణి బిగ్బాస్పై మండిపడింది. ఈ వీడియోపై పలువురు పాజిటివ్గానే స్పందిస్తున్నారు. కాగా, రవి తల్లి బిగ్ బాస్ వేదికగా తన కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…