ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) లో ఖాళీగా ఉన్నటువంటి 46 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్,టీజీటీ, కేర్ టేకర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 19 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిన్సిపల్ గ్రేడ్ -2 విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.40,270-రూ.93,780 చెల్లించనున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాంటి వారు మాత్రమే అర్హులు.
టీజీటీ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 28,940-రూ.78,910 వరకు చెల్లించనున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా టెట్ పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి.
కేర్ టేకర్/వార్డెన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.21,200 నుంచి రూ. 63,010 చెల్లించనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇప్పటికే ఈ ఉద్యోగానికి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 2021 ఆగస్టు 19వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.https://welfarerecruitments.apcfss.in/
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…