ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) లో ఖాళీగా ఉన్నటువంటి 46 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్,టీజీటీ, కేర్ టేకర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 19 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిన్సిపల్ గ్రేడ్ -2 విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.40,270-రూ.93,780 చెల్లించనున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాంటి వారు మాత్రమే అర్హులు.
టీజీటీ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 28,940-రూ.78,910 వరకు చెల్లించనున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా టెట్ పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి.
కేర్ టేకర్/వార్డెన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.21,200 నుంచి రూ. 63,010 చెల్లించనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇప్పటికే ఈ ఉద్యోగానికి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 2021 ఆగస్టు 19వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.https://welfarerecruitments.apcfss.in/
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…