అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజ్ కుంద్రా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కుంద్రాకు చెందిన విదేశీ కంపెనీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు పలు వీడియో టేపులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా విషయం ఇంతలా ఉంటే శిల్పాశెట్టి మాత్రం తన భర్తను వెనకేసుకొస్తుండడం విశేషం. తన భర్త అశ్లీల చిత్రాలు తీయలేదని, శృంగార సినిమాలను తీశారని, వాటికి, అశ్లీలానికి సంబంధం లేదని శిల్పాశెట్టి తెలిపింది. కాగా 120 అశ్లీల చిత్రాలను తీసేందుకు గాను కుంద్రా దాదాపుగా రూ. 9 కోట్లను ఖర్చు చేసినట్టు తెలిసింది.
ఇక రాజ్ కుంద్రాకి చెందిన వియన్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పదవి శిల్పా శెట్టి గతంలో రాజీనామా చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఆమె ఎందుకు రాజీనామా చేసింది ? అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజ్ కుంద్రా పోలీసుల కస్టడీలో ఉండగా, అతన్ని మరిన్ని రోజుల పాటు అదుపులో ఉంచుకుని అతని నుంచి మరిన్ని వివరాలను రాబట్టనున్నారు. అతనిపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు కేసును విచారించనున్నారు. అయితే ఇంత జరిగినా మరోవైపు శిల్పాశెట్టి మాత్రం తన భర్త అమాయకుడని, అతన్ని వెనకేసుకు వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…