TDP Situation: ఏపీలో సీఎం జగన్ ప్రభంజనం మొదలైనప్పటి నుంచి టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే వైకాపాయే ఘన విజయం సాధిస్తూ వస్తోంది. ఇక తాజాగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైపీసీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఈ ఏడాది మార్చి 10నే జరిగాయి. అయితే కోర్టు వివాదాల కారణంగా ఫలితాలు తాజాగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీకి ఏకంగా 47 సీట్లు రాగా టీడీపీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. జనసేన, బీజేపీలకు సీట్లు దక్కలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరులో టీడీపీ 68,175 ఓట్లో 42 శాతం ఓట్లను సాధించగా ఇప్పుడది 28 శాతానికి పడిపోయింది. తాజాగా ఆ పార్టీకి 37,414 ఓట్లు వచ్చాయి. అదే క్రమంలో వైకాపాకు 2019లో 44.73 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 56.43 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్యలను బట్టి చూస్తే టీడీపీ డౌన్ ఫాల్ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతుంది. దీంతో ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి టీడీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను చురుగ్గానే పోషిస్తోంది. అనేక రకాల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రజలు ఆ పార్టీని ఓన్ చేసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. వినిపించడమే కాదు, ఎన్నికల ఫలితాలు కూడా అదే చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ డౌన్ ఫాల్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముందు ముందు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…