TDP Situation: ఏపీలో సీఎం జగన్ ప్రభంజనం మొదలైనప్పటి నుంచి టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే వైకాపాయే ఘన విజయం సాధిస్తూ వస్తోంది. ఇక తాజాగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైపీసీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఈ ఏడాది మార్చి 10నే జరిగాయి. అయితే కోర్టు వివాదాల కారణంగా ఫలితాలు తాజాగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీకి ఏకంగా 47 సీట్లు రాగా టీడీపీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. జనసేన, బీజేపీలకు సీట్లు దక్కలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరులో టీడీపీ 68,175 ఓట్లో 42 శాతం ఓట్లను సాధించగా ఇప్పుడది 28 శాతానికి పడిపోయింది. తాజాగా ఆ పార్టీకి 37,414 ఓట్లు వచ్చాయి. అదే క్రమంలో వైకాపాకు 2019లో 44.73 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 56.43 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్యలను బట్టి చూస్తే టీడీపీ డౌన్ ఫాల్ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతుంది. దీంతో ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి టీడీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను చురుగ్గానే పోషిస్తోంది. అనేక రకాల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రజలు ఆ పార్టీని ఓన్ చేసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. వినిపించడమే కాదు, ఎన్నికల ఫలితాలు కూడా అదే చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ డౌన్ ఫాల్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముందు ముందు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…