ఈ ప్రపంచంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే మహిళలకు రక్షణ కరువైంది. రోజురోజుకు ఇలాంటి అత్యాచారం కేసులు ఎక్కడో ఒక చోట నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన పాకిస్థాన్లో చోటు చేసుకుంది. పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్ను ఆమె స్నేహితులే ఎంతో దారుణంగా చంపిన ఘటన చోటు చేసుకుంది.
నూర్ ను అతి దారుణంగా పొట్టనబెట్టుకున్న ప్రధాన నిందితుడు మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు చేసిన ప్రకటనతో పాక్ అట్టుడికిపోతోంది. ఈ క్రమంలోనే మహిళలు పెద్ద ఎత్తున ప్లకార్డులు చేతబట్టి రోడ్డు పైకి దిగి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే #justicefornoor అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్ను మంగళవారం రాత్రి ఇస్లామ్బాద్ సెక్టార్ ఎఫ్-7/4లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది. ఈమె హత్యకు గురైన ఇల్లు తన స్నేహితుడు జహీర్ జకీర్ జాఫర్ది కావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే హత్యకు గురైన నూర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్ట్ మార్టంలో డాక్టర్లు ఆశ్చర్యపోయే ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలోనే వైద్య అధికారులు మాట్లాడుతూ.. బ్రతికుండగానే ఆమెను ఎంతో చిత్ర వధ చేశారు. సూదులతో శరీరంపై పొడిచారు, జుట్టు మొత్తం కత్తిరించారు. బ్రతికుండగానే తనని తగలబెట్టి ఆపై పదునైన కత్తితో పీక కోసి చంపారని వైద్యులు వెల్లడించారు. ఈ విధంగా ఒక ఒక యువతి పట్ల దారుణంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా పాక్ ఉలిక్కి పడింది. ఈ క్రమంలోనే తనకు న్యాయం జరగాలంటూ, నిందితులకు కఠిన శిక్ష పడాలని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ పరిస్థితులలో జకీర్ను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…