ఈ ప్రపంచంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే మహిళలకు రక్షణ కరువైంది. రోజురోజుకు ఇలాంటి అత్యాచారం కేసులు ఎక్కడో ఒక చోట నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన పాకిస్థాన్లో చోటు చేసుకుంది. పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్ను ఆమె స్నేహితులే ఎంతో దారుణంగా చంపిన ఘటన చోటు చేసుకుంది.
నూర్ ను అతి దారుణంగా పొట్టనబెట్టుకున్న ప్రధాన నిందితుడు మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు చేసిన ప్రకటనతో పాక్ అట్టుడికిపోతోంది. ఈ క్రమంలోనే మహిళలు పెద్ద ఎత్తున ప్లకార్డులు చేతబట్టి రోడ్డు పైకి దిగి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే #justicefornoor అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్ను మంగళవారం రాత్రి ఇస్లామ్బాద్ సెక్టార్ ఎఫ్-7/4లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది. ఈమె హత్యకు గురైన ఇల్లు తన స్నేహితుడు జహీర్ జకీర్ జాఫర్ది కావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే హత్యకు గురైన నూర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్ట్ మార్టంలో డాక్టర్లు ఆశ్చర్యపోయే ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలోనే వైద్య అధికారులు మాట్లాడుతూ.. బ్రతికుండగానే ఆమెను ఎంతో చిత్ర వధ చేశారు. సూదులతో శరీరంపై పొడిచారు, జుట్టు మొత్తం కత్తిరించారు. బ్రతికుండగానే తనని తగలబెట్టి ఆపై పదునైన కత్తితో పీక కోసి చంపారని వైద్యులు వెల్లడించారు. ఈ విధంగా ఒక ఒక యువతి పట్ల దారుణంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా పాక్ ఉలిక్కి పడింది. ఈ క్రమంలోనే తనకు న్యాయం జరగాలంటూ, నిందితులకు కఠిన శిక్ష పడాలని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ పరిస్థితులలో జకీర్ను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…