Huzurabad Election: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెరాసకు రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన నియోజకవర్గం అయిన హుజురాబాద్లో ఆయనకు వ్యతిరేకంగా తెరాసలో ఎవరు పోటీ చేస్తారు ? అన్న చర్చ బలంగా కొనసాగుతోంది. ఇప్పటికీ తెరాస ఇంకా ఈటలకు పోటీగా ఎవరినీ బరిలో దింపలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఆ దిశగా ఆలోచన చేయడం లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోటీ ఈటలకు, తెరాసకు మధ్యే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. అయితే ఈటల లాంటి బలమైన నాయకున్ని ఎదుర్కొనేందుకు అంతే బలంగా ముందుకు సాగాలి. అందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీమ్ను ప్రవేశపెట్టారా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
దళిత బంధు స్కీమ్ను దశలవారీగా రాష్ట్రంలో అమలు చేయనున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్లో దీన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. దీంతో వారు తమకు నచ్చిన వ్యాపారం, ఉపాధి కల్పించుకోవచ్చు. దళితుల సాధికారత కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు గాను తొలి దశ కింద రూ.1200 కోట్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు స్కీమ్ను దశలవారీగా అమలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 కుటుంబాలకు సహాయం అందిస్తారు. ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ స్కీమ్ను అమలు చేస్తారు.
అయితే ఈ స్కీమ్ను ప్రకటించినప్పటి నుంచి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తెరాసపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారని అంటున్నాయి. ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. అయితే ఈ స్కీమ్ వల్ల హుజురాబాద్లో తెరాస గెలుపు ఖాయమేనా ? అంటే ఆ విషయం ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే స్కీమ్ను అమలు చేసినా అది ఈటల నియోజకవర్గం కనుక, ఆయన బలమైన నేత కనుక ఇంకా అనేక వ్యూహాలను అమలు చేయాలి. ఈ స్కీమ్లో డబ్బులు తీసుకున్న వారు కచ్చితంగా తెరాసకు ఓటు వేస్తారన్న గ్యారంటీ లేదు. కానీ మెజారిటీ ప్రజలు ఓటు వేసేందుకు చాన్స్ ఉంది. అదే జరిగితే ఈ ఉప ఎన్నికలో తెరాస పై చేయి సాధిస్తుంది. లేదా ఈటల గెలుస్తారు. మరి ఈ స్కీమ్ అక్కడ తెరాసకు ఓట్లను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. కానీ తెరాస మాత్రం దళిత బంధుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…