భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. పూర్వకాలంలో ఇంట్లో ఏ చిన్న కార్యం జరిగినా బంధువులకు, గ్రామ ప్రజలకు అరిటాకులో భోజనం వడ్డించే వారు. అయితే ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ ప్రజలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది.
పూర్వ కాలంలో మనం ఏ ఇంటికి వెళ్లినా.. వచ్చిన అతిథుల కోసం అరటి ఆకు, మర్రి ఆకు, మోదుగ ఆకులలో భోజనం వడ్డించేవారు. ఇలా ఆకులలో భోజనం చేయడం ఒక సాంప్రదాయమైనప్పటికీ, ఆకులలో భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన సంప్రదాయాల ప్రకారం అరటి చెట్టు, రావి చెట్లను దైవ సమానంగా భావించి పూజలు చేస్తారు.
ఎంతో పరమపవిత్రంగా భావించే ఈ చెట్ల ఆకులలో భోజనం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఆకులలో భోజనం చేయడం వల్ల ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎవరైనా విషప్రభావం చేసి ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. విష ప్రభావం చేసినప్పుడు అరిటాకులో అన్నం తినడం వల్ల ఆకు మొత్తం నీలి రంగులోకి మారిపోతుంది. అలాగే ఆకుపచ్చని ఆకులలో క్లోరోఫిల్ ఉండటం వల్ల అందులో ఉన్న పదార్థాలు మన శరీరానికి అందుతాయి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యాధులు నయమవుతాయి. కనుక ఈ ఆకులలో భోజనం చేయడం శుభప్రదంగా చెప్పవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…