Deepam : దీపాన్ని ఎప్పుడూ నెయ్యితోనే వెలిగించాలి.. ఎందుకంటే..?

September 8, 2023 8:32 AM

Deepam : మనం ప్రతి రోజు దేవుడిని కొలుస్తూ ఉంటాము. పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఇంట కూడా నిత్యం దీపాన్ని పెడుతూ ఉంటారు. దీపాన్ని మనం నూనెతో కానీ నెయ్యితో కానీ వెలిగిస్తూ ఉంటాము. నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి ఎంతో పవిత్రమైనది. పవిత్రమైన వస్తువులతో పూజిస్తే హృదయం, మనసు, పర్యావరణం కూడా శుద్ధి అవుతుంది. ఆవు పాల నుండి నెయ్యిను తయారుచేస్తారు. అది ఎంతో స్వచ్ఛమైనది. నెయ్యి మంచి సువాసనని కలిగి ఉంటుంది. పూజ స్థలంపై ఇది మంచి ప్రభావం చూపిస్తుంది.

మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. నెయ్యి వలన వాటిలో శక్తి ప్రవహిస్తుంది. అందుకని నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిదని అంటూ ఉంటారు. ఇంట్లో నేతితో దీపాన్ని వెలిగిస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఆవు పాలతో చేసిన నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లోకి క్రిములు ప్రవేశించవు.

we must lit Deepam with only ghee
Deepam

అందుకని నెయ్యిని వాడతారు. నెయ్యితో ప్రార్థన స్థలంలో దీపం వెలిగిస్తే చాలా ప్రశాంతత వస్తుంది. నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెయ్యిని పంచామృత స్వరూపంగా కూడా భావిస్తారు. అందుకే నేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని పండితులు అంటుంటారు.

పూజ అయిపోయిన తర్వాత హారతిని ఇస్తారు. హారతికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. హారతిని ఇంట్లో ఇవ్వడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మనం దీపారాధన చేయడం, హారతి ఇవ్వడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికపరంగా మాత్రమే అని భావిస్తాం. కానీ నిజానికి వీటి వలన మనలో, మన ఇంట్లో కూడా ప్రభావం పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment