మన హిందూ ఆచారాల ప్రకారం ప్రతి నెలా మనకు రెండు ఏకాదశి తిధులు వస్తాయి. అందులో ఒకటి శుక్లపక్షంలో రాగా, మరొకటి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో కెల్లా అత్యంత ముఖ్యమైన ఏకాదశి నిర్జల ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి జేష్ట మాస శుక్ల పక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఎంతో నియమ నిష్టలతో విష్ణు దేవుడికి పూజ చేయటం వల్ల మిగిలిన 23 ఏకాదశలకు పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు. మరి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
జేష్ట మాస శుక్ల ఏకాదశి రోజు వచ్చే ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో పవిత్రమైనది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి గంగాజలంతో విష్ణు ప్రతిమకు అభిషేకం చేయాలి. అదేవిధంగా విష్ణు దేవుడికి ప్రత్యేకమైన అలంకరణ చేసి వివిధ రకాల పుష్పాలతో పాటు తులసి మాలలను కూడా సమర్పించాలి. అయితే ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసంతో పూజ చేయాలి. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకూడదు.
ఈ ఏకాదశి బ్రహ్మ ముహూర్తంలో మొదలై అమృత కాలంలో ముగిస్తుంది. ఈ విధంగా స్వామివారికి పూజ అనంతరం విష్ణు సహస్రనామాలను పఠించాలి.అలాగే స్వామివారికి సాత్విక నైవేద్యం సమర్పించడంతో స్వామి వారు ఎంతో ప్రీతి చెంది మనం కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తారు. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో తప్పనిసరిగా తులసీదళాలతో ఉండేలా చూసుకోవాలి. తులసీ దళాలు లేనిది స్వామి వారి పూజ పూర్తి కాదు.ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు కేవలం స్వామి వారికి మాత్రమే కాకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…