మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం అశోక్ గజపతి రాజు అన్న కుమార్తె సంచయిత గజపతి రాజుని 2020లో ట్రస్టు చైర్మన్గా నియమించింది. అలాగే సింహాచలం దేవస్థానం చైర్మన్గా కూడా ఎంపిక చేసింది. దీనిపై వివాదం చెలరేగింది. ఈ క్రమంలో అశోక్ గజపతి రాజు హైకోర్టులో కేసు వేసి విజయం సాధించారు. దీంతో ఆ రెండు బాధ్యతలను ఆయన తిరిగి చేపట్టారు. దీంతో సంచయిత పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే సంచయితకు త్వరలోనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమెకు ఏ పదవీ ఇవ్వకుండా అలాగే వెనక్కి పంపిస్తే పార్టీ పరంగా ఇబ్బందులు వస్తాయని, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని సీఎం జగన్ భావిస్తున్నారట. అందుకని రాష్ట్రంలో ఖాళీ అయిన 7 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆమెకు ఒక స్థానం ఇవ్వొచ్చని చర్చించుకుంటున్నారు.
నిజానికి మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో మొదట్నుంచీ ప్రతిపక్షాలు విమర్శించాయి. తరువాత కోర్టు కేసులు.. ఆ తరువాత సంచయిత పదవులు పోవడం.. ఇవన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయి. ఈ క్రమంలో ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా అలాంటి విమర్శలు అన్నింటికీ చెక్ పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…