వేసవికాలం వచ్చిందంటే మనకు మార్కెట్లో మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడి పండ్లతో వివిధ రకాల వంటలను తయారు చేసుకొని తింటుంటారు. ఈ క్రమంలోనే కొందరు జ్యూస్ లు, పచ్చడిలు చేసుకుంటారు. అయితే ఈ మామిడి పండ్లతో పాపడ్ తయారుచేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ మ్యాంగో పాపడ్ తినడానికి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడుతుంటారు. మరి మ్యాంగో పాపడ్ ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*బాగా పండిన మామిడికాయ గుజ్జు ఒక కప్పు
*చక్కర అర కప్పు
*నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు
*మిరియాల పొడి టేబుల్ స్పూన్
ముందుగా నెయ్యిని మూడు పెద్ద ప్లేట్లకు రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి మామిడి గుజ్జు పంచదార వేసుకొని చిన్న మంటపై బాగా కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమంలోకి నీరు వేయకుండా ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు కలియబెడుతూ ఉండాలి. ఈ విధంగా ఈ మిశ్రమంలోకి మిరియాల పొడి వేసి మిశ్రమం మొత్తం దగ్గరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టాఫ్ చేసిన వెంటనే ఈ మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లలో వేసి ప్లేట్ మొత్తం సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ఈ మిశ్రమం చల్లారగానే దీనిని ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…