సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది అనే విషయం ఎవరికీ తెలియదు.కొందరు జీవితం ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సంతోషంగా సాగిపోతే మరికొందరి జీవితం ఎన్నో కష్టాల సుడిగుండంలోకి పడుతుంది. అత్తింటివారి పెట్టే బాధలను భరించలేక అమ్మాయి ఎంతో నలిగిపోతుంది. అచ్చం ఇలాగే పెళ్లి తర్వాత అదనపు కట్నం తేవాలని కోడలిని నానా చిత్రహింసలకు గురి చేసి ఎనిమిది నెలలుగా ఒక గదిలోనే బంధించిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్లోని సుపౌల్లో జిల్లాలోని కిసాన్పూర్కు చెందిన విక్రమ్ చౌదరి కుమారుడు సంజయ్ చౌదరికి ఢిల్లీలోని నోయిడాకు చెందిన మోనా అనే యువతితో మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మోనా తండ్రి వరుడికి ఒక కారు, 17 లక్షలను లాంఛనంగా ఇచ్చారు. ప్రస్తుతం మోన కుటుంబం కిసాన్పూర్లో నివసిస్తున్నారు. వీరికి ఒక ఏడాది పాప కూడా ఉంది.
తాజాగా తన అత్తింటివారు తనను పుట్టింటి నుంచి అదనంగా మరో పది లక్షలు కట్నం తేవాలని ఆమెను వేధించడం మొదలు పెట్టారు.అత్తింటి వారు డిమాండ్ చేసిన కట్నం తీసుకురా కాకపోవడంతో ఆమెను గత ఎనిమిది నెలల నుంచి ఒకే గదిలో బందీగా చేసి నానా హింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వెంటనేమహిళా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆమెకు విముక్తి కల్పించారు.బాధితురాలి వాంగ్మూలం ప్రకారం అదనపు కట్నం కోసమే తనను వేధిస్తున్నారని ఈ క్రమంలోనే తన భర్త, అత్తమామలు, ఆడపడుచుల పై కేసును నమోదు చేసుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…