సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది అనే విషయం ఎవరికీ తెలియదు.కొందరు జీవితం ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సంతోషంగా సాగిపోతే మరికొందరి జీవితం ఎన్నో కష్టాల సుడిగుండంలోకి పడుతుంది. అత్తింటివారి పెట్టే బాధలను భరించలేక అమ్మాయి ఎంతో నలిగిపోతుంది. అచ్చం ఇలాగే పెళ్లి తర్వాత అదనపు కట్నం తేవాలని కోడలిని నానా చిత్రహింసలకు గురి చేసి ఎనిమిది నెలలుగా ఒక గదిలోనే బంధించిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్లోని సుపౌల్లో జిల్లాలోని కిసాన్పూర్కు చెందిన విక్రమ్ చౌదరి కుమారుడు సంజయ్ చౌదరికి ఢిల్లీలోని నోయిడాకు చెందిన మోనా అనే యువతితో మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మోనా తండ్రి వరుడికి ఒక కారు, 17 లక్షలను లాంఛనంగా ఇచ్చారు. ప్రస్తుతం మోన కుటుంబం కిసాన్పూర్లో నివసిస్తున్నారు. వీరికి ఒక ఏడాది పాప కూడా ఉంది.
తాజాగా తన అత్తింటివారు తనను పుట్టింటి నుంచి అదనంగా మరో పది లక్షలు కట్నం తేవాలని ఆమెను వేధించడం మొదలు పెట్టారు.అత్తింటి వారు డిమాండ్ చేసిన కట్నం తీసుకురా కాకపోవడంతో ఆమెను గత ఎనిమిది నెలల నుంచి ఒకే గదిలో బందీగా చేసి నానా హింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వెంటనేమహిళా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆమెకు విముక్తి కల్పించారు.బాధితురాలి వాంగ్మూలం ప్రకారం అదనపు కట్నం కోసమే తనను వేధిస్తున్నారని ఈ క్రమంలోనే తన భర్త, అత్తమామలు, ఆడపడుచుల పై కేసును నమోదు చేసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…