Vinayaka Chavithi : వినాయక చవితి పండుగ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. వాడ వాడలా గణనాథులు కొలువు దీరి 9 రోజుల పాటు భక్తులచే విశేష రీతిలో పూజలందుకుంటారు. తరువాత అంగరంగ వైభవంగా నిమజ్జనం నిర్వహిస్తారు. ఇలా ప్రతి ఏడాది ప్రజలు వినాయక చవతి వేడుకలను జరుపుకుంటుంటారు. ఇక ఈసారి సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి వచ్చింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య మంచి ముహుర్తం ఉందని పండితులు చెబుతున్నారు.
అయితే వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గణేషుడు భోజన ప్రియుడు కనుక ఆయనకు అనేక రకాల పిండి వంటలను నైవేద్యంగా పెడుతుంటారు. అయితే గణేషుడికి పెట్టే పిండి వంటల విషయానికి వస్తే వాటిల్లో ఉండ్రాళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. తరువాత ఆయనకు మోదకాలను కూడా నైవేద్యంగా పెడుతుంటారు. ఈ రెండు పిండి వంటలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. కనుక భక్తులు వినాయక చవితి నాడు గణేషుడికి ఈ రెండు పిండి వంటలను నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు ఏవైనా తీరని కోరికలు ఉంటే మనసులో బలంగా కోరుకోండి. దీంతో మీరు కోరిన కోరికలను ఆ బొజ్జ గణపయ్య నెరవేరుస్తాడు.
ఇక వినాయక చవితి నాడు చాలా మంది 21 రకాల పత్రాలను సేకరించి మరీ ఆయనకు పూజలు చేస్తుంటారు. ఇది టెక్ యుగం కనుక మనకు ఏది కావాలన్నా కూడా లభిస్తోంది. అయితే గణేషుడి పూజకు గాను మీకు 21 రకాల పత్రి లభించకపోతే మీరు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయనకు గరిక అంటే మహా ఇష్టం. కనుక గరికతో ఆయనను పూజిస్తే చాలు. ఇతర పత్రి లేదని బాధ పడాల్సిన అవసరం లేదు. ఇలా వినాయకుడికి ఉండ్రాళ్లు, మోదకాలు చేసి పెట్టడంతోపాటు ఆయనకు రెండు గరిక పోచలను సమర్పించి భక్తితో వేడుకుంటే మన కోరికలను ఆయన నెరవేరుస్తాడు. కనుక ఆయనను ఇలా పూజించడం మరిచిపోకండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…