Vinayaka Chavithi : వినాయక చవితి పండుగ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. వాడ వాడలా గణనాథులు కొలువు దీరి 9 రోజుల పాటు భక్తులచే విశేష రీతిలో పూజలందుకుంటారు. తరువాత అంగరంగ వైభవంగా నిమజ్జనం నిర్వహిస్తారు. ఇలా ప్రతి ఏడాది ప్రజలు వినాయక చవతి వేడుకలను జరుపుకుంటుంటారు. ఇక ఈసారి సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి వచ్చింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య మంచి ముహుర్తం ఉందని పండితులు చెబుతున్నారు.
అయితే వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గణేషుడు భోజన ప్రియుడు కనుక ఆయనకు అనేక రకాల పిండి వంటలను నైవేద్యంగా పెడుతుంటారు. అయితే గణేషుడికి పెట్టే పిండి వంటల విషయానికి వస్తే వాటిల్లో ఉండ్రాళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. తరువాత ఆయనకు మోదకాలను కూడా నైవేద్యంగా పెడుతుంటారు. ఈ రెండు పిండి వంటలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. కనుక భక్తులు వినాయక చవితి నాడు గణేషుడికి ఈ రెండు పిండి వంటలను నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు ఏవైనా తీరని కోరికలు ఉంటే మనసులో బలంగా కోరుకోండి. దీంతో మీరు కోరిన కోరికలను ఆ బొజ్జ గణపయ్య నెరవేరుస్తాడు.
ఇక వినాయక చవితి నాడు చాలా మంది 21 రకాల పత్రాలను సేకరించి మరీ ఆయనకు పూజలు చేస్తుంటారు. ఇది టెక్ యుగం కనుక మనకు ఏది కావాలన్నా కూడా లభిస్తోంది. అయితే గణేషుడి పూజకు గాను మీకు 21 రకాల పత్రి లభించకపోతే మీరు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయనకు గరిక అంటే మహా ఇష్టం. కనుక గరికతో ఆయనను పూజిస్తే చాలు. ఇతర పత్రి లేదని బాధ పడాల్సిన అవసరం లేదు. ఇలా వినాయకుడికి ఉండ్రాళ్లు, మోదకాలు చేసి పెట్టడంతోపాటు ఆయనకు రెండు గరిక పోచలను సమర్పించి భక్తితో వేడుకుంటే మన కోరికలను ఆయన నెరవేరుస్తాడు. కనుక ఆయనను ఇలా పూజించడం మరిచిపోకండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…