Vinayaka Chavithi 2024 : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వినాయక చవితి వచ్చేసింది. ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున గణనాథులను ప్రతిష్టించేందుకు, నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వినాయకుడికి పూజలు చేసే సమయంలో కొన్ని విషయాలను మాత్రం మరిచిపోకూడదని పండితులు చెబుతున్నారు. ఇక ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి రోజున ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. ప్రమిదలో కొబ్బరినూన పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి.
ఇలా దీపం వెలిగిస్తే గణనాథుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు. 21 పత్రాలతో పూజించడం వీలుకాని వారు గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పించినా అంతే ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. ఇక పండుగ నాగు ఎరుపు, నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయని వారు చెబుతున్నారు. కనుక పండితులు చెబుతున్న ఈ విషయాలను మరిచిపోకండి. ఇక వినాయక చవితి రోజు మంచి ముహుర్తం ఎప్పుడు ఉంది, పూజ ఎప్పుడు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది వినాయక చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో వచ్చిందని పండితులు చెబుతున్నారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం 7నే (శనివారం) వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభ ముహుర్తం ఉందని అన్నారు. సాయంత్రం 6.22 గంటల నుంచి రాత్రి 7.30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఇక ప్రతిసారి లాగే ఈసారి కూడా మట్టి వినాయకులనే పూజించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుంది. ప్రతి వేడుకా పర్యావరణ హితంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. గణేష చతుర్ధికి వాడే పూజ పత్రాలన్నీ ప్రకృతి సిద్ధమైనవే. మరి పార్వతీ పుత్రుడి విగ్రహాలను మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసినవి ఎందుకు వాడాలి..? నిమజ్జనం అనంతరం నీటిలో సులువుగా కలిసిపోయేలా, ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఉండే మట్టి గణనాథుల్నే పూజకు వినియోగించాలి. ఆ గణపయ్య కృపకు పాత్రులు కావాలి.. అని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…