Best Remedies To Remove Kidney Stones : మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు మన శరీరలోని వ్యర్థాలను వడబోస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీంతో శరీరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే పలు కారణాల వల్ల కొందరికి కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతుంటాయి. నీళ్లను సరిగ్గా తాగకపోవడం వాటిలో ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు. రోజూ కొందరు తగిన మోతాదులో నీళ్లను తాగరు. దీని వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. అవి కిడ్నీల వరకు ప్రయాణించి అక్కడే రాళ్లుగా తయారవుతాయి. కనుక కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు ఆ సమస్య మరింత ఎక్కువ అవొద్దంటే రోజూ తగినంత మోతాదులో నీళ్లను తాగాల్సి ఉంటుంది.
ఇక కిడ్నీ స్టోన్లు ఉన్నవారు పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీంతో కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. అలాగే ఒక టీస్పూన్ తులసి ఆకుల రసంలో కాస్త తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా చేసినా కూడా సమస్య నుంచి బయట పడవచ్చు.
కిడ్నీ స్టోన్లు ఉన్నవారు కొత్తిమీర ఆకులను వేసి మరిగించిన నీళ్లను తాగుతుంటే చక్కని ఉపశమనం లభిస్తుంది. కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. అలాగే అరకిలో పెసర పప్పును లీటర్ నీటిలో కాచిన అనంతరం పైన తేరే కట్టును తాగలి. అదేవిధంగా వేపాకులను కాల్చి బూడిద చేసి ఒక రోజున నిల్వ చేసిన అనంతరం ఆ మిశ్రమాన్ని రెండు పూటలా నీళ్లలో కలిపి తాగుతుండాలి. ఇలా చేస్తున్నా కూడా కిడ్నీల్లోని రాళ్లను కరిగించుకోవచ్చు.
అయితే కిడ్నీ స్టోన్లు ఉన్నవారు రోజూ తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. టమాటా, క్యాబేజీ, పాలకూర వంటివి ఈ జాబితాకు చెందుతాయి. కనుక కిడ్నీ స్టోన్లు ఉన్నవారు కేవలం పైన తెలిపిన చిట్కాలను మాత్రమే కాకుండా సరైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే సమస్య నుంచి త్వరగా బయట పడతారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…