Dining Table : పూర్వకాలం నుంచి మన పెద్దలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ వస్తున్నారు. వాస్తు ప్రకారమే మనం ఎప్పటి నుంచో ఇళ్లను కట్టుకుంటున్నాం. వాస్తు శాస్త్రాన్ని పాటించకపోతే మన ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. అది సమస్యలను కలగజేస్తుంది. ఇక ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ పెట్టాలి అన్న విషయాలను కూడా మనకు వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో ఎక్కడ పెట్టాల్సిన వస్తువును అక్కడ పెట్టకపోతే వాస్తు దోషం ఏర్పడుతుంది. దీని వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఇక వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను కొన్ని చోట్లలో ఉంచితేనే మనకు మంచి జరుగుతుంది.
చాలా మంది ఇండ్లలో డైనింగ్ టేబుల్ ఉంటుంది. అక్కడ కుటుంబం అందరూ కలసి కూర్చుని భోజనం చేస్తారు. అలాంటి చోట్ల పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. నెగెటివ్ ఎనర్జీ గనక ఉంటే అది మనకు సమస్యలను తెచ్చి పెడుతుంది. అందువల్ల డైనింగ్ టేబుల్ విషయంలోనూ మనం వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇక ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే కొందరు తెలిసీ తెలియక తప్పులు చేస్తుంటారు. కొందరు పెట్టకూడని వస్తువులను డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటారు. దీంతో అక్కడంతా నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఫలితంగా అది ఇల్లంతా వ్యాపించి దోషాన్ని కలగజేసి సమస్యలను సృష్టిస్తుంది. వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను డైనింగ్ టేబుల్ పై పెట్టకూడదు. కొందరు తాళం చెవులను తీసుకువచ్చి నేరుగా డైనింగ్ టేబుల్ మీదే పడేస్తారు. అలా చేయకూడదు. తాళం చెవులను డైనింగ్ టేబుల్ మీద పెడితే నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కనుక ఆ పని చేయడం మానుకోవాలి.
ఇక కొందరు మెడిసిన్లను కూడా డైనింగ్ టేబుల్ మీదే పెడుతుంటారు. ఇలా పెడితే వాస్తు ప్రకారం నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. భోజనం చేసిన వెంటనే ట్యాబ్లెట్లను వేసుకోవచ్చని చెప్పి కొందరు ఇలా చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే పుస్తకాలను కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టకూడదు. ఇవి కూడా నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి. దీంతోపాటు కత్తులు, పదునైన వస్తువులు, ఆర్టిఫిషియల్ పండ్లు వంటి వాటిని కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టకూడదు. ఇవి నెగెటివ్ ఎనర్జీని కలగజేస్తాయి. ఇలా కొన్ని రకాల వస్తువులను డైనింగ్ టేబుల్ మీద పెట్టడం మానుకోవాలి. దీంతో దోషం పోతుంది. సమస్యల నుంచి బయట పడతారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…