Foods For Sleep : ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగ నడుస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది వేగంగా పనులు చేస్తున్నారు. అంతా బాగానే ఉంటుంది కానీ నిద్ర విషయంలోనే చాలా మంది సరిగ్గా శ్రద్ధ వహించడం లేదు. నిద్ర సరిగ్గాపోకపోతే అనేక తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. నిద్ర సరిగ్గా లేకపోతే అధిక బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు రెండింతలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కనుక ఎవరైనా సరే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాల్సి ఉంటుంది. పెద్దలు అయితే రోజుకు 6 నుంచి 8 గంటలు, చిన్నారులు 10 గంటల వరకు నిద్రించాలి.
అయితే ఒత్తిడి, ఆందోళన కారణంగానే చాలా మందికి నిద్ర పట్టడం లేదని తెలుస్తోంది. డిప్రెషన్ కూడా తోడవడం దీనికి కారణం అవుతోంది. కానీ కింద చెప్పిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలను చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ పాలు తాగడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలను తాగాలి. అందులో కాస్త తేనె కలిపితే ఇంకా మంచిది. దీంతో పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్ర చక్కగా పడుతుంది.
పాలలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందువల్ల పాలను తాగితే మన శరీరం సెరొటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి నిద్ర హార్మోన్లు. కనుక మనకు నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. కాబట్టి రోజూ రాత్రి పాలను తాగితే మంచిది. దీంతో చక్కగా నిద్రించవచ్చు. అలాగే ఉదయం ఆహారంలో ఓట్ మీల్ను తినాలి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది.
అరటి పండ్లు, వాల్ నట్స్ను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా రోజూ నిద్ర పోవచ్చు. వాల్ నట్స్ను ఉదయం నానబెట్టి సాయంత్రం తినాలి. ఇక అరటి పండును సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో తినాలి. అలాగే కమోమిల్ టీ, బాదంపప్పు, కివి పండ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా నిద్ర చక్కగా పడుతుంది. ఇవన్నీ నిద్రను ప్రోత్సహించే ఆహారాలు. కాబట్టి వీటిని తినడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…