Foods For Sleep : ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగ నడుస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది వేగంగా పనులు చేస్తున్నారు. అంతా బాగానే ఉంటుంది కానీ నిద్ర విషయంలోనే చాలా మంది సరిగ్గా శ్రద్ధ వహించడం లేదు. నిద్ర సరిగ్గాపోకపోతే అనేక తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. నిద్ర సరిగ్గా లేకపోతే అధిక బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు రెండింతలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కనుక ఎవరైనా సరే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాల్సి ఉంటుంది. పెద్దలు అయితే రోజుకు 6 నుంచి 8 గంటలు, చిన్నారులు 10 గంటల వరకు నిద్రించాలి.
అయితే ఒత్తిడి, ఆందోళన కారణంగానే చాలా మందికి నిద్ర పట్టడం లేదని తెలుస్తోంది. డిప్రెషన్ కూడా తోడవడం దీనికి కారణం అవుతోంది. కానీ కింద చెప్పిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలను చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ పాలు తాగడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలను తాగాలి. అందులో కాస్త తేనె కలిపితే ఇంకా మంచిది. దీంతో పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్ర చక్కగా పడుతుంది.
పాలలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందువల్ల పాలను తాగితే మన శరీరం సెరొటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి నిద్ర హార్మోన్లు. కనుక మనకు నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. కాబట్టి రోజూ రాత్రి పాలను తాగితే మంచిది. దీంతో చక్కగా నిద్రించవచ్చు. అలాగే ఉదయం ఆహారంలో ఓట్ మీల్ను తినాలి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది.
అరటి పండ్లు, వాల్ నట్స్ను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా రోజూ నిద్ర పోవచ్చు. వాల్ నట్స్ను ఉదయం నానబెట్టి సాయంత్రం తినాలి. ఇక అరటి పండును సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో తినాలి. అలాగే కమోమిల్ టీ, బాదంపప్పు, కివి పండ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా నిద్ర చక్కగా పడుతుంది. ఇవన్నీ నిద్రను ప్రోత్సహించే ఆహారాలు. కాబట్టి వీటిని తినడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…