Coins In River : ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదంటే ప్రత్యేకించి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, అందులో డబ్బులు వేస్తూ ఉంటాము. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు గోదావరి, కృష్ణ నదులు కానీ లేదంటే ఇంకేమైనా నదులు కనపడితే, ట్రైన్లో నుంచే నాణేలు వేస్తూ ఉంటాము. అయితే, ఎందుకు అలా వేస్తారు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం నుండి కూడా పూర్వీకులు, నది స్నానాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు.
నదీ స్నానం చేస్తే, ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు. నది దగ్గర పూజలు కూడా చేస్తూ ఉంటారు. దీపాన్ని పెట్టి, నదిలో నాణేలు కూడా వేస్తూ వుంటారు. అయితే, పూర్వీకులు పాటించినట్లే మనం కూడా పాటిస్తూ వచ్చాము. అయితే, అసలు ఎందుకు నాణేలు వేసేవారు.. అనే విషయానికి వచ్చేస్తే.. ఇప్పుడైతే నాణేలు ఇనుప ముక్కలే. ఇది వరకు నాణేలు రాగివి ఉండేవి. రాగి వాటినే ఇది వరకు ఎక్కువగా వాడేవారు.
రాగి పాత్రలు, రాగి నాణేలు వాళ్ళు వాడేవాళ్లు, కానీ ఇప్పుడు అలా కాదు. అయితే, ఇది వరకు ఉండే రాగి కాయిన్స్ ని నీళ్లలో వేయడం వలన నీళ్లు శుభ్రంగా మారేవి. నీటిని శుభ్రం చేసే గుణం రాగి కి ఉంది. అందుకని, రాగి వాటిని అందులో వేసేవారు. రాగి కాయిన్స్ అందులో వేయడం వలన, నీళ్లు బాగా స్వచ్ఛంగా మారేవి. నదిలోని నీళ్లు శుభ్రం అవుతాయి. అటువంటి నీళ్లు తాగడానికి పనికొస్తాయని, రాగి కాయిన్స్ ని నదిలో వేసేవారు.
కానీ, ఇప్పుడు రాగి నాణేలు లేవు. మనం వాడుతున్న నాణేలని నదిలో వేయడం వలన ఉపయోగం అయితే ఏమీ లేదు. నీరు శుభ్రం అవ్వవు. ఇక ఇప్పుడు ఈ నాణాలని వేయడం వలన అవి తుప్పుపట్టేస్తాయి. నీళ్లు కూడా పాడైపోతాయి. కాబట్టి, ఇలా వేయడం వలన ఉపయోగం లేదని తెలుసుకోండి. కొంతమంది కొబ్బరికాయలు కొట్టి నదిలోకి విసురేస్తూ ఉంటారు. అలా చేయడం వలన కూడా నీళ్లు పాడైపోతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…