Lord Shiva : చాలా మంది శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి శివుడిని కొలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడిని పూజిస్తే, చక్కటి ఫలితం ఉంటుందని జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. ఎప్పుడైనా ఆలయంలో శివుడిని చూసినట్లయితే, శివుడికి కుంకుమ తిలకం ఉండదు. ఈశ్వరుడికి ఇలా చాలా విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. కొన్ని వస్తువులతో శివుడిని పొరపాటున కూడా పూజించకూడదని అంటున్నారు. మరి వాటి గురించి చూద్దాం.
ఈసారి మీరు శివుడిని ఆరాధించేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. మీరు శివుడిని పూజించేటప్పుడు, తులసి ఆకులని అసలు ఉపయోగించకూడదు. అలానే, శంఖం, కొబ్బరినీళ్లు, ఎర్రని రంగులో ఉండే పువ్వులు పెట్టకూడదు. వీటిని శివుడికి సమర్పించడం మంచిది కాదు. వీటితో అస్సలు శివుడిని ఆరాధించకూడదు. శివుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తుల కోరికల్ని పరమేశ్వరుడు వెంటనే తీరుస్తాడు.
మహాశివరాత్రి, శ్రావణమాసం అంటే శివుడికి చాలా ప్రీతికరం. ఆ రోజుల్లో పూజలు చేస్తే, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని దేవుళ్ళని విగ్రహరూపంలో పూజిస్తూ ఉంటాం. కానీ, శివుడిని లింగ రూపంలో పూజిస్తాం. అన్ని దేవుళ్ళకి తిలకం పెట్టినట్లు శివుడికి పెట్టరు. శివుడిని పూజించేటప్పుడు, కుంకుమ, సింధూరం వంటివి పెట్టకూడదు. సింధూరం, కుంకుమ చాలా దేవుళ్ళకి ఎంతో ఇష్టం. అందుకని వాటిని పూజ సమయంలో వాడుతూ ఉంటాము.
కానీ, శివుడికి అలా కాదు. శివుడికి శంఖంతో నీళ్లు ఇవ్వకూడదు. తులసి ఆకులని శివుడికి పెట్టకూడదు. కొబ్బరి నీళ్ళని కూడా శివుడికి సమర్పించకూడదు. అలానే, ఎర్రటి పూలతో కూడా పూజ చేయకూడదు. శివుడికి పసుపుతో కూడా పూజ చేయకూడదు. పసుపుతో కూడా శివుడిని పూజించడం మంచిది కాదని పండితులు అంటున్నారు. కనుక, ఈ తప్పులను చేయకుండా చూసుకోండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…