ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తన 18 నెలల కొడుకును తల్లి చిత్ర హింసలు పెట్టసాగింది. కొడుకును ఎప్పుడూ చితకబాదుతూ, వీపుపై దెబ్బలు కొడుతూ, చెంప దెబ్బలు కొడుతూ ఉండేది. అయితే ఆ కసాయి తల్లి బారి నుంచి ఎట్టకేలకు ఆ బాలున్ని రక్షించగలిగారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని వల్లిపురంకు చెందిన వడివళగన్కు, ఏపీకి చెందిన తులసి అనే మహిళకు 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తులసి ఎప్పుడూ ఫోన్లో వేరే వ్యక్తితో మాట్లాడుతుండేది. అది గమనించిన భర్త ఆమెను వారించాడు. దీంతో కోపగించుకున్న ఆమె అతనితో గొడవ పడుతుండేది.
చివరకు భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను పిల్లలతో సహా ఏపీలోని పుట్టింట్లో వదిలిపెట్టాడు. కానీ అక్కడ తులసి తన 18 నెలల కొడుకును చిత్రహింసలు పెట్టసాగింది. అతన్ని తీవ్రంగా కొట్టేది. దీంతోపై వీపుపై ఎర్రగా దెబ్బలు ఉండేవి. చెంప దెబ్బలు కొడుతుండేది. అయితే ఆమె కొట్టినప్పుడు రికార్డు చేసిన దృశ్యాలను బంధువులు చూశారు. దీంతో ఆమె భర్తకు సమాచారం అందించారు.
ఆమె భర్త విషయం తెలుసుకుని పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు. తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 323, 355, 75 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు ప్రస్తుతం మానసిక వైద్యులచే కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…