కొందరికి అదృష్టం మరీ జలగల్లా పడుతుంటుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఓ జాలరి కొన్ని ప్రత్యేకమైన జాతికి చెందిన చేపలను పట్టాడు. వాటిని అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఉన్న ముర్బెకు చెందిన చంద్రకాంత్ తారే ఆగస్టు 15న ఇంకొందరు జాలర్లతో కలిసి వాధ్వన్ జిల్లాలోని తీర ప్రాంతం నుంచి 25 నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే ఆగస్టు 28న అతను ఘోల్ (Ghol) అనే జాతికి చెందిన ప్రత్యేకమైన చేపలను పట్టాడు. మొత్తం 157 ఘోల్ చేపలను పట్టాడు. తరువాత వాటికి ముర్బెలో వేలం నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందిన కొందరు వర్తకులు మొత్తం 157 చేపలను రూ.1.33 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో ఆ జాలరి పంట పండింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
కాగా ఘోల్ చేపలను Sea Gold చేపలు అని కూడా పిలుస్తారు. ఇవి అత్యంత ఖరీదైన చేపల జాతిలో ఒకటి. ఇవి మన దేశంలోని సముద్రాల్లో చాలా తక్కువగా లభిస్తాయి. కాలుష్యం కారణంగా ఈ చేపలు అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరాయి. ఈ చేపలను పట్టేందుకు మత్స్యకారులు కొన్ని సార్లు సముద్రంలో చాలా లోతు వరకు గాలం వేయాల్సి ఉంటుంది.
ఇండోనేషియా, థాయ్లాండ్, హాంగ్ కాంగ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో ఘోల్ చేపలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఈ చేపలు ఎక్కువ ధర పలుకుతాయి. వీటి నుంచి తీసే పలు పదార్థాలతో మందులను తయారు చేస్తారు. ఈ చేపల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఇవి అత్యంత ఆరోగ్యకరమైన చేపలుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఆ జాలరికి ఈ చేపలు లభించడం వల్ల అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…