సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ అధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూశారా. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఆలయంలో సాక్షాత్తూ పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు. ఈ విధంగా ఆలయంలో దొంగతనం చేసినప్పుడే భక్తుల కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తులు విశ్వసిస్తారు. మరి ఆ విచిత్రమైన ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ చరిత్ర ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీలో చూడియాలాలో ఆలయం ఉంది. దాని పేరు చూడామణి ఆలయం. ఈ ఆలయాన్ని సంతాన ఆలయం అని కూడా పిలుస్తారు. పిల్లలు లేని వారు ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో అమ్మవారి పాదాల చెంత ఉన్న విగ్రహాలను మాత్రమే దొంగతనం చేయాలి. ఈ విధంగా చెక్క విగ్రహాలను దొంగతనం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుందని, సంతానం కలిగిన తర్వాత ఆ చెక్క బొమ్మతో పాటు మరో చెక్క బొమ్మను తీసుకు వచ్చి ఆలయంలో స్వామివారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలోనే పిల్లలు లేని ఎంతో మంది దంపతులు ఈ ఆలయానికి వచ్చి ఆ చెక్క బొమ్మలను దొంగతనం చేస్తుంటారు. ఈ ఆలయంలోని అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా దొంగతనం చేయాలని ఇక్కడి పూజారులు ప్రజలు భావిస్తారు. పూర్వం ఒక రాజుకి అమ్మవారు చెక్క రూపంలో దర్శనం ఇవ్వడం వల్ల ఆ రాజు ఆ చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్లగా తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతా ఆ తల్లి మహిమేనని భావించిన రాజు తరువాత తన కుటుంబంతో చెక్క బొమ్మను తీసుకువచ్చి ఆలయంలో సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని ఆలయం చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి సంతానం కావాలనే వారు ఈ సంతాన ఆలయానికి వచ్చి దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…