సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ అధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూశారా. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఆలయంలో సాక్షాత్తూ పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు. ఈ విధంగా ఆలయంలో దొంగతనం చేసినప్పుడే భక్తుల కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తులు విశ్వసిస్తారు. మరి ఆ విచిత్రమైన ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ చరిత్ర ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీలో చూడియాలాలో ఆలయం ఉంది. దాని పేరు చూడామణి ఆలయం. ఈ ఆలయాన్ని సంతాన ఆలయం అని కూడా పిలుస్తారు. పిల్లలు లేని వారు ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో అమ్మవారి పాదాల చెంత ఉన్న విగ్రహాలను మాత్రమే దొంగతనం చేయాలి. ఈ విధంగా చెక్క విగ్రహాలను దొంగతనం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుందని, సంతానం కలిగిన తర్వాత ఆ చెక్క బొమ్మతో పాటు మరో చెక్క బొమ్మను తీసుకు వచ్చి ఆలయంలో స్వామివారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలోనే పిల్లలు లేని ఎంతో మంది దంపతులు ఈ ఆలయానికి వచ్చి ఆ చెక్క బొమ్మలను దొంగతనం చేస్తుంటారు. ఈ ఆలయంలోని అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా దొంగతనం చేయాలని ఇక్కడి పూజారులు ప్రజలు భావిస్తారు. పూర్వం ఒక రాజుకి అమ్మవారు చెక్క రూపంలో దర్శనం ఇవ్వడం వల్ల ఆ రాజు ఆ చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్లగా తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతా ఆ తల్లి మహిమేనని భావించిన రాజు తరువాత తన కుటుంబంతో చెక్క బొమ్మను తీసుకువచ్చి ఆలయంలో సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని ఆలయం చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి సంతానం కావాలనే వారు ఈ సంతాన ఆలయానికి వచ్చి దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…