టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో ఈయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కెరియర్ మొదట్లో చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో నుంచి వరుస అప్డేట్లను విడుదల చేస్తూ చిత్ర బృందం అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ నటిస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి ఓ వ్యక్తి కారణమని పవన్ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.
ఉన్నత చదువులు చదవడానికి ఏమాత్రం ఇష్టపడని పవన్ కల్యాణ్ ఒంటరిగా కూర్చొని ఏవో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలోనే తన వదిన, మెగాస్టార్ భార్య సురేఖ చిరంజీవితో మాట్లాడి పవన్ కల్యాణ్ ను ఎలాగైనా సినిమాలలోకి తీసుకు వెళ్లాలని సూచించారట. సినిమాలంటే ఇష్టం లేని పవన్ కల్యాణ్ ను సురేఖ బలవంతంగా ప్రోత్సహించడం వల్లే నేడు పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా కొనసాగుతున్నారని ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎన్నో సందర్భాలలో కూడా తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ స్టార్డమ్ సంపాదించడం వెనక తన వదిన సురేఖ ప్రోత్సాహం చాలా ఉందని చెప్పవచ్చు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…