సాధారణంగా చిన్న పిల్లలకి ఏవి ప్రమాదకరమైనవి, ఏవి ప్రమాదకరమైనవి కావో వారికి తెలియదు.. కనుక నిత్యం తల్లిదండ్రులు వారిని గమనిస్తూనే ఉండాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలవడంతో పిల్లలు ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా కరెంట్ స్తంభాలను తాకకూడదని వారికి అర్థమయ్యే విధంగా హెచ్చరించాలి. లేదంటే ఈ బాలుడికి జరిగిన విధంగా జరుగుతుంది. రాజస్థాన్లోని చురు జిల్లాలో ఉన్న సదుల్పూర్ తాలూకా నుహంద్ అనే గ్రామంలో ఒక బాలుడు సరదాగా ఆడుకుంటూ కరెంటు స్తంభాన్ని తాకాడు. ఇలా తాకగానే కరెంట్ షాక్ కొడుతూ ఆ బాలుడు స్తంభానికి అతుక్కుపోయాడు.
ఆ గ్రామానికి చెందిన ఆదిల్ అనే బాలుడు మరొక బాలుడితో కలిసి సరదాగా ఆడుకుంటూ రోడ్డుపై వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిల్ రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని తాకాడు. అప్పటికే ఆ స్తంభం వెంట విద్యుత్ ప్రవాహం వస్తుండడంతో ఒక్కసారిగా ఆ బాలుడు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అతని శరీరం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఈ విధంగా ఆ బాలుడు విద్యుత్ ఘాతానికి గురై కొట్టుమిట్టాడుతుంటే ఈ విషయాన్ని గమనించిన ఓ స్థానికుడు ఎంతో ధైర్యం చేశాడు.
ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి ఆ బాలుడిని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్న ఒక చెక్కతో ఆ బాలుడి చేతిని కొట్టి పక్కకు లాగాడు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకుని ఆ బాలుడిని రక్షించే పనిలో పడ్డారు. అయితే వారు అతన్ని బయటకు తీసి వెంటనే హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడి శరీరం బాగా కాలిపోయింది. దీంతో అతను విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇలా ఎవరి పిల్లలకూ జరగకూడదు. కనుక చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…