బీహార్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ ఇటీవలి కాలంలో కొందరి ఖాతాల్లో కోట్ల రూపాయల్లో డబ్బు జమ అవుతోంది. బ్యాంకులో ఏర్పడిన సాంకేతిక సమస్య లేదా ఇతర కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ కొందరి ఖాతాల్లో ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అలాగే తాజాగా ఓ రైతు ఖాతాలో ఏకంగా రూ.52 కోట్లు జమ అయ్యాయి. దీంతో అతను, అధికారులు షాక్ తిన్నారు.
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కతిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన రామ్ బహదూర్ షా అనే రైతుకు నెల నెలా పెన్షన్ వస్తోంది. అందులో భాగంగానే పెన్షన్ వచ్చిందా, రాలేదా ? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అతను సమీపంలో ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ) వద్దకు వెళ్లాడు.
సీఎస్పీ వద్ద ఉద్యోగులు అతని ఖాతాను చెక్ చేశారు. అందుకుగాను ఆధార్ బయోమెట్రిక్ తీసుకున్నారు. అయితే రామ్ బహదూర్ షా ఖాతాలో ఏకంగా రూ.52 కోట్లు ఉండడాన్ని చూసి అందరూ ఖంగు తిన్నారు. అంత మొత్తం ఆ రైతు ఖాతాలోకి ఎలా వచ్చిందో తెలియడం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఆ రైతు మాత్రం తన జీవితం దుర్భరంగా మారిందని, కనుక ఆ మొత్తంలో కొంత డబ్బును తన ఖాతాలో అలాగే ఉంచాలని.. దీంతో తన జీవితం బాగు పడుతుందని అధికారులను వేడుకుంటున్నాడు. అయినా వారు అతని మాట వినరు కదా. అయితే ఈ విధంగా చాలా మంది ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు ఎందుకు జమ అవుతుందో అర్థం కావడం లేదు. దీనిపై త్వరలోనే వివరాలు తెలియనున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…