మీరు ఎస్బీఐ ఖాతాదారులా.. ఇంటి లోన్ తీసుకోవాలి.. అనుకుంటున్నారా.. అయితే మీకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) శుభవార్తను తెలియజేసింది. బ్యాంకు లోన్ తీసుకునే వారికి ఊరట కలిగిస్తూ స్టేట్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంటికి రుణాలు తీసుకునే వారి కోసం లోన్ పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. మనం ఎంత లోన్ తీసుకున్నామనే విషయం గురించి కాకుండా గృహ రుణాలపై తమ కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ కేవలం 6.70 శాతం వడ్డీతో రుణాలను ఇవ్వనుంది.
అయితే కస్టమర్ల క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్ మంజూరు చేయనున్నారు. మనం ఎంత పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నా ఇదే వడ్డీ శాతం అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకు గృహ రుణాలు రూ.75 లక్షల వరకు తీసుకున్న వారు ఏకంగా 7.15 శాతం వడ్డీని చెల్లించాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం అదే మొత్తంలో లోన్ తీసుకున్నప్పటికీ కేవలం 6.70 శాతం మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధమైన రుణ సదుపాయం పొందడం కోసం ఉద్యోగులు, వ్యాపారం చేసే వారు అర్హులేనని స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. ఇలా స్టేట్ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంతో 30 సంవత్సరాలలోపు గృహ రుణం తీసుకున్న కస్టమర్ సుమారుగా రూ.8 లక్షల వరకు లబ్ధి పొందవచ్చని స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎస్ శెట్టి తెలిపారు. స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…