ప్రస్తుత తరుణంలో ఆత్మహత్యలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లవ్లో ఫెయిల్ అయ్యామనో.. చాలా మంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇలాగే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలోని మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న బడంగ్పేట చంద్రవిహార్కాలనీకి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి కుమార్తె ప్రశాంతి (18) డిగ్రీ రెండో సంవత్సరం విద్యను అభ్యసిస్తోంది. అయితే ప్రశాంతి తరచూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో ఆ విషయాన్ని ఆమె తండ్రి గమనించాడు.
అయితే ఫోన్లో తరచూ మాట్లాడొద్దని, ఎక్కువగా ఉపయోగించొద్దని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…