ప్రస్తుత తరుణంలో ఆత్మహత్యలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లవ్లో ఫెయిల్ అయ్యామనో.. చాలా మంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇలాగే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలోని మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న బడంగ్పేట చంద్రవిహార్కాలనీకి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి కుమార్తె ప్రశాంతి (18) డిగ్రీ రెండో సంవత్సరం విద్యను అభ్యసిస్తోంది. అయితే ప్రశాంతి తరచూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో ఆ విషయాన్ని ఆమె తండ్రి గమనించాడు.
అయితే ఫోన్లో తరచూ మాట్లాడొద్దని, ఎక్కువగా ఉపయోగించొద్దని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…