కోవిడ్ మొదటి వేవ్ నుంచి ఇప్పటికీ నటుడు సోనూసూద్ ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాడు. సహాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా, లేదనకుండా ఆదుకుంటున్నాడు. ఇక పేదలకు సహాయం చేయడం కోసం సోనూసూద్ ఏకంగా తన ఆస్తులనే తాకట్టు పెట్టాడు. దీంతో సోనూసూద్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సోనూసూద్ రీల్ లైఫ్లో విలన్ పాత్రలను పోషించినా రియల్ లైఫ్లో మాత్రం స్టార్ హీరో అని ఆయన అభిమానులు ఆయనను పొగుడుతున్నారు.
ఇక సోనూసూద్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. తాను సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నానని తెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు సినిమా ఆఫర్లు భారీగానే వస్తున్నాయని, అయితే అన్ని సినిమాల్లోనూ నటించలేను కనుక తనకు ఆసక్తిగా అనిపించిన సినిమాల్లోనే నటిస్తున్నానని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే కొనసాగుతాయని, సహాయం కోసం వచ్చిన వారిని కచ్చితంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
ఇక ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు మళ్లీ తగ్గుతున్నాయి కనుక సినిమాలపై ఫోకస్ పెట్టానని సోనూసూద్ తెలిపాడు. అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలను ఆపేది లేదన్నాడు. తాను తన తల్లిదండ్రుల నుంచి సేవాభావాన్ని అలవర్చుకున్నానని తెలిపాడు. తాను ఒక సాధారణ వ్యక్తినేనని అన్నాడు. తన ఫౌండేషన్లో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400 మంది పనిచేస్తున్నారని, వారు అవసరం ఉన్నవారికి సహాయం అందిస్తున్నారని తెలియజేశాడు.
కాగా సోనూసూద్ కోవిడ్ మొదటి వేవ్లో దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను రైళ్లు, బస్సులు, విమానాలు, ఇతర వాహనాల్లో సొంత గ్రామాలకు తరలించేందుకు ఎంతో సహాయం చేశాడు. తరువాత ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నవారికి అండగా నిలిచాడు. ఇప్పుడు అనేక హాస్పిటళ్ల వద్ద ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బాధితులకు ఆక్సిజన్ను అందిస్తున్నాడు. నిజంగా సోనూసూద్ రియల్ హీరోనే కదా..!
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…