ప్రభుత్వ ఉద్యోగాలలో కొలువై ఉన్న అధికారులు వారు ప్రజలకు సేవ చేయడం కోసమే అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పనులు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు అధికారులు ఆ విషయాన్ని మర్చిపోయి వారు గొప్ప స్థాయిలో ఉన్నామని భావించి ఎంతో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విధంగానే ఓ అధికారి దురుసు ప్రవర్తన తీవ్ర పరిణామాలకు దారి తీసింది.రాజస్థాన్ జలోరి జిల్లాలో శాంఖోర్ ఏరియాలో.. రైతులపై తిరగబడిన అధికారి ఏకంగా రైతులను కాలితో తన్నిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు వేయిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతాప్పురా గ్రామం మీదుగా రోడ్డు వెళ్తుంది. అయితే ప్రతాప్పురా గ్రామ రైతులు అధికారులను అడ్డుకున్నారు.కేంద్ర ప్రభుత్వం రోడ్డు వేయడానికి తమ భూములను లాక్కొని వారికి పరిహారం చెల్లించలేదని అది చెల్లించే వరకు రోడ్డు వేయడానికి వీలు లేదని రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి ఏకంగా రైతులపై తిరగబడి వారిని కాలితో తన్నాడు. అదే విధంగా 15 సంవత్సరాల బాలికను తన బండితో పాటు కొంతదూరం లాక్కెళ్లి తోసాడు.
ఈ విధంగా రైతుల పై తిరగబడటమే కాకుండా పదిహేను సంవత్సరాల బాలికపై అరాచకంగా ప్రవర్తించడంతో రైతులు మహిళలు అధికారులు పై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.తమ పొలాలను లాక్కొని వారికి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్లు వేయడానికి గ్రామస్తులు ఒప్పుకోలేదు. అయితే ఇదే విషయమై తమకు న్యాయం జరగాలని రైతులు కోర్టును ఆశ్రయించగా కరోనా కారణం చేత కోర్టు మూతపడటంతో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు.ఈ క్రమంలోనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కోర్టు తీర్పు వచ్చే వరకు రోడ్డు పనులను ఆపివేస్తున్నట్లు రోడ్డు నిర్మాణ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…