ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు.ముఖ్యంగా మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉంటే కరోనా మహమ్మారి బారిన పడిన కూడా మనకి ఎలాంటి ప్రమాదం ఉండదని భావించడంతో ప్రతి ఒక్కరు వారి రోజువారి ఆహారంలో భాగంగా గుడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను వివిధ రకాలుగా తయారు చేసుకొని తింటుంటారు.
గుడ్డులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందాలంటే తప్పనిసరిగా గుడ్లను ఉడికించి తిన్నప్పుడే అందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. అయితే ఒకసారి ఉడికించిన గుడ్డును ఎంత సమయంలోగా తినాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.
సాధారణంగా ఒక సారి ఉడికించిన కోడిగుడ్డును ఫ్రిజ్ లో పెట్టకుండా కేవలం రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోగా తినేయాలి. లేదంటే ఆ గుడ్డు పై ఇతర బ్యాక్టీరియాలు చేరి అది ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ ఉడికించిన గుడ్లను రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలనే వారు రెండు నుంచి ఐదు రోజుల వ్యవధిలోగా తినాలి.అయితే ఉడికించిన కోడిగుడ్లను బయట బాగా చల్లార్చి వాటిపై భాగంలో ఎలాంటి తేమ లేకుండా గుడ్లను ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవాలి. కోడిగుడ్డు పైభాగం పగిలిన వాటిని ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదు.ఒకవేళ ఉడికించిన కోడిగుడ్లు ఫ్రిజ్లో పెట్టి మరి వాటిని తినాలని భావించినప్పుడు తినడానికి ఒక పది నిమిషాలు ముందుగా బయటకు తీసే పెట్టాలి.ఉడికించిన కోడిగుడ్లను ఫ్రిజ్లో నిల్వ చేసేటప్పుడు పొరపాటున కూడా గుడ్డు పెంకును తొలగించకూడదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…