బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి చేసే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పటాస్ కార్యక్రమం ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత పాపులారిటీని దక్కించుకుంది.
తాజాగా శ్రీముఖి స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ కార్యక్రమానికి యాంకర్ గా వర్షిణి వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కామెడీ స్టార్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా స్టేజిపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఎంతో రచ్చ చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా పలువురు కమెడియన్స్ వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న టువంటి శేఖర్ మాస్టర్ స్టేజీపై చిందులు వేస్తూ ప్రేక్షకులను మరింత సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి గోరేటి వెంకన్న వచ్చారు. ఈయన “మల్లేశం” సినిమాలో పాడిన ఓహో జాంబియా అనే పాట ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ పాటకు పలువురు స్టేజ్ పై చిందులు వేయగా శ్రీముఖి కూడా స్టేజ్ పై సందడి చేస్తూ.. మన వెంకన్న ఉండేవరకు ఈ స్టేజ్ మీద మనం ఎవరు తగ్గేదే లే… అంటూ ఎంతో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…