బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి చేసే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పటాస్ కార్యక్రమం ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత పాపులారిటీని దక్కించుకుంది.
తాజాగా శ్రీముఖి స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ కార్యక్రమానికి యాంకర్ గా వర్షిణి వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కామెడీ స్టార్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా స్టేజిపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఎంతో రచ్చ చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా పలువురు కమెడియన్స్ వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న టువంటి శేఖర్ మాస్టర్ స్టేజీపై చిందులు వేస్తూ ప్రేక్షకులను మరింత సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి గోరేటి వెంకన్న వచ్చారు. ఈయన “మల్లేశం” సినిమాలో పాడిన ఓహో జాంబియా అనే పాట ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ పాటకు పలువురు స్టేజ్ పై చిందులు వేయగా శ్రీముఖి కూడా స్టేజ్ పై సందడి చేస్తూ.. మన వెంకన్న ఉండేవరకు ఈ స్టేజ్ మీద మనం ఎవరు తగ్గేదే లే… అంటూ ఎంతో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…