ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు పరాకాష్ట ఈ సంఘటన. స్కూల్ ఫీజు కట్టలేదని ఆ బాలికను ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్కూల్లో అందరి ముందు అవమానించాడు. ఆ అవమాన భారం భరించలేని బాలిక ఇంటికి వచ్చి స్పృహ తప్పి పడిపోయి మృతి చెందింది. దీంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్పై ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఉన్న ఉన్నావ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదర్శ్ నగర్ లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి 15 ఏళ్ల కుమార్తె స్థానికంగా ఉన్న ఏబీ నగర్లోని సరస్వతి విద్యా మందిర్లో 10వ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు స్కూల్ ఫీజు చెల్లించలేదు. దీంతో ఆ బాలికపై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది.
ఇక తాజాగా ఆ బాలికను పిలిపించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెను అందరి ముందు అవమానించాడు. ఫీజు కట్టలేదని ఎగతాళి చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఆమె ఆ అవమాన భారాన్ని భరించలేకపోయింది. ఆమె ఇంటికి వస్తూనే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ క్రమంలో వారు ఆ ప్రిన్సిపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ప్రిన్సిపాల్ కథనం మాత్రం మరోలా ఉంది. తాము ఎల్లప్పుడూ ఫీజు విషయాలను తల్లిదండ్రులతోనే చర్చిస్తామని, విద్యార్థులపై ఒత్తిడి తేమని, ఆ బాలిక తల్లిదండ్రులు రూ.2000 ఫీజును చెల్లించారని, అలాంటిది మళ్లీ ఎలా అడుగుతామని అన్నాడు. ఆ బాలికకు ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకనే ఆమె చనిపోయి ఉంటుందని.. తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం కేసును విచారిస్తున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…