అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “లవ్ స్టోరీ”. ఈ సినిమా షూటింగ్ మొత్తం కరోనా రెండవ దశ కంటే ముందుగానే పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కరోనా కారణం చేత వాయిదా పడింది. ఈ క్రమంలోనే థియేటర్లు తెరుచుకోవడంతో ఈ సినిమా విడుదల చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాను వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
అయితే తాజాగా మరోసారి ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీన ఓటీటీలో నాని నటించిన “టక్ జగదీష్” చిత్రం విడుదల కానుంది, అదేవిధంగా 9వ తేదీ నితిన్ నటించిన “మాస్ట్రో” డిస్నీ హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఇక కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమా 10వ తేదీన విడుదల కావడంతో లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వరుస సినిమాలన్నీ ఓటీటీ వేదికగా విడుదల కావడంతో నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీని మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తిరిగి ఈ సినిమాను సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓటీటీలో ఏవైనా చిత్రాలు వాటి విడుదల తేదీని వాయిదా వేసుకుంటే లవ్ స్టోరీ సినిమా విధిగా 10వ తేదీనే విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…