కరోనా ఉందని, జాగ్రత్తలు పాటించాలని, లేదంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎంత చెప్పినా కొందరు వినడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పైగా కొందరు మరీ అతి చేస్తున్నారు. మాకు కోవిడ్ ఉంది, మేం ఇలాగే చేస్తాం.. ఎవరాపుతారో చూస్తాం.. అంటూ వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఓ మహిళ కూడా ఇలాగే ప్రవర్తించింది. చివరకు జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే..
పెన్సిల్వేనియాలో ఉన్న గెరిటీస్ అనే సూపర్ మార్కెట్కు మార్గరెట్ అన్ సర్కో అనే మహిళ వచ్చింది. అయితే ఆమె ఆ సూపర్ మార్కెట్లోని ఆహారాలన్నింటిపైనా దగ్గుతూ ఉమ్మి వేసింది. దీంతో స్టోర్ వారికి 35వేల డాలర్ల (దాదాపుగా రూ.25 లక్షల) నష్టం వచ్చింది. అయితే ఆమెను వెంటనే సూపర్ మార్కెట్లోని సెక్యూరిటీ గార్డులు బయటకు తోసేశారు. తరువాత పోలీసులకు అప్పగించారు.
ఆమె అలా ఆ పనిచేసినప్పుడు తనకు కోవిడ్ ఉందని కూడా చెప్పింది. అయితే తరువాత ఆమెకు టెస్టులు చేయగా కోవిడ్ నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ ఆమె చేసింది తప్పే కనుక కోర్టులో హాజరు పరిచారు.
ఈ సంఘటన గతేడాది మార్చిలో జరగ్గా ఇప్పటికి విచారణ పూర్తయింది. దీంతో ఆ మహిళ ఎట్టకేలకు తాను తప్పు చేశానని, ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నానని, అందుకే అలా ప్రవర్తించానని, తనను క్షమించాలని న్యాయమూర్తిని వేడుకుంది. దీంతో న్యాయమూర్తి ఆమెకు 2 ఏళ్ల జైలు శిక్షతో సరిపెట్టారు. అలాగే సూపర్ మార్కెట్కు 30వేల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అవును మరి.. బహిరంగ ప్రదేశాల్లో అలా వెకిలిగా, అనుచితంగా ప్రవర్తిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు మరి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…