కరోనా ప్రభావం వల్ల ఎంతో మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో వారు మళ్లీ ఉపాధి పొందడం కష్టంగా మారింది. అయితే అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ మహిళ చాలా తెలివిగా ఆలోచించింది. కరోనా వల్ల అంతా ఆన్లైన్లోనే జరుగుతోంది. కనుక తాను కూడా ఆన్లైన్లోనే బిజినెస్ చేయాలనుకుంది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేసింది.
రాజస్థాన్లోని అమరావతి అనే ప్రాంతానికి చెందిన భావన మనోజ్ దేశ్వానిది బోటిక్ బిజినెస్. కుటుంబంలో అందరూ కలసి కట్టుగా ఆ వ్యాపారం చేస్తారు. అందరూ పనిచేస్తారు. ఇక భావన చక్కని ఎంబ్రాయిడరీ డిజైన్లు చేస్తుంది. అయితే కోవిడ్ వల్ల లాక్డౌన్లను అమలు చేస్తుండడంతో వారి వ్యాపారం బాగా డౌన్ అయింది. తీవ్రమైన నష్టాలు వచ్చాయి. కానీ భావన ఆలోచనతో వారు మల్లీ విజయవంతంగా వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో ఖాతాను ఓపెన్ చేసి అందులో తమ ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించింది.
మొదట్లో అందులో మాస్కులను తయారు చేసి అమ్మేవారు. అవి చక్కని డిజైన్లలో ఉండడంతో మంచి ఆదరణ లభించింది. దీంతో వారు మాస్కులతోపాటు హెయిర్ యాక్ససరీలు, దుస్తులు, డ్రెస్సులు, కుర్తీలు, చిన్నారుల దుస్తులు తదితర ఫ్యాషన్ ఉత్పత్తులను కుట్టి, వాటికి చక్కని డిజైన్లు చేసి అమ్మడం మొదలు పెట్టారు. క్రమంగా వారు ప్రగతిని సాధించారు.
భావన కుటంబం ఇప్పుడు నెలకు రూ.80వేల వరకు సంపాదిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారానే ఇకపై ఉత్పత్తులను అమ్ముతామని చెబుతోంది. ఓ కొరియర్ సంస్థతో ఆమె ఒప్పందం చేసుకుంది. దీంతో వారు తమ ఉత్పత్తులను దేశం మొత్తం ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తున్నారు. అలా వారు కొద్ది నెలల్లోనే సక్సెస్ సాధించారు. తీవ్రమైన సమస్యలతో సతమతం అవుతున్నవారు, స్వయం ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఈ విధంగా భావన లాగా ప్రయత్నిస్తే ఏదో ఒక ఉపాధి పొంది ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…