ప్రత్యేక సేల్స్ పేరిట ఈ-కామర్స్ సంస్థలు అప్పుడప్పుడు భారీ డిస్కౌంట్లతో వస్తువులను అమ్ముతుంటాయి. గరిష్టంగా 50-60 శాతం వరకు కొన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్లను అందిస్తుంటాయి. అయితే అమెజాన్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సేల్లో మాత్రం ఓ ఏసీపై ఏకంగా 94 శాతం తగ్గింపును అందించింది. దీంతో కొందరు అత్యంత తక్కువ ధరకే ఆ ఏసీని కొనుగోలు చేశారు.
అమెజాన్లో తోషిబా 2021 స్ప్లిట్ ఏసీ ధర రూ.96,700గా ఉంది. అయితే ఈ ఏసీపై 94 శాతం తగ్గింపు ధరను ఇచ్చారు. దీంతో రూ.5,900కే ఏసీ లభించింది. విషయం తెలుసుకున్న కొందరు ఏసీని కొనుగోలు చేశారు. అయితే సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని తెలుసుకున్న అమెజాన్ వెంటనే లోపాన్ని సవరించింది. దీంతో ప్రస్తుతం అదే ఏసీ 30 శాతం తగ్గింపుతో రూ.59వేలకు లభిస్తోంది. సదరు ఏసీలో బాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, డీ హ్యుమిడిఫైర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అందువల్లే ఆ ఏసీ అంతటి ధరను కలిగి ఉంది.
అయితే ఏసీని కేవలం కొందరు మాత్రమే రూ.5,900 ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నిజానికి అమెజాన్లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ సేల్ సందర్భంగా రూ.9 లక్షల విలువైన కెమెరాను రూ.6500 విక్రయించారు. దీంతో ఆఫర్ తెలిసిన జనాలు ఎగబడ్డారు. అయితే తప్పు తెలుసుకున్న అమెజాన్ వెంటనే సమస్యను పరిష్కరించింది. ఇక ఇప్పుడు కూడా ఇలాగే జరగడం విశేషం.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…