గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక చాలా మంది జాబ్లను వెదుక్కునే పనిలో పడతారు. ఉద్యోగం దొరికితే సరే.. లేదంటే ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇక కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా ఉద్యోగాలు దొరకడం ఇంకా కష్టతరమవుతోంది. అయితే ఉద్యోగాలు దొరక్కపోయినా సరే తమ కాళ్లపై తాము నిలబడగలమని ఆ యువతులు నిరూపించారు. స్వయం ఉపాధి ద్వారా చక్కని ఆదాయం సంపాదిస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన డి.రిషి వర్మ, నిజామాబాద్కు చెందిన కె.శ్రీదుర్గలు గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ వుమెన్ లో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ స్టడీస్ (రిటెయిల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ) విద్యను అభ్యసించారు. అయితే గ్రాడ్యుయేషన్ చేశారు కానీ కోవిడ్ వల్ల ఉద్యోగాలు దొరడం లేదు కదా, అందువల్ల ఖాళీగా ఉండడం ఇష్టం లేక సొంతంగా వ్యాపారం మొదలు పెట్టారు. ఫోక్టేల్స్ 22 పేరిట సంస్థను నెలకొల్పారు. దాని సహాయంతో ఊరగాయ పేరిట అనేక రకాల పచ్చళ్లు, పొడులను తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 16న బేగంపేటలో వారు ఊరగాయను నెలకొల్పగా దాంతో పచ్చళ్లు, పొడులను తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత నాణ్యంగా, శుభ్రమైన ప్యాకింగ్తో అత్యంత రుచికరంగా ఉండేలా వాటిని అందిస్తున్నారు. దీంతో వారి పచ్చళ్లు, పొడులకు రెగ్యులర్ కస్టమర్లు ఏర్పడ్డారు. ఈ విధంగా వారు ఇందులో సక్సెస్ సాధించారు.
ప్రస్తుతం వారు www.theuragaya.com అనే వెబ్సైట్ను ఏర్పాటు చేసి అందులో పచ్చళ్లను, పొడులను విక్రయిస్తున్నారు. టమాటా, మామిడి, నిమ్మ, గోంగూర, అల్లం, ఉసిరికాయ, ఎండు మిరప కాయ వంటి పచ్చళ్లను తయారు చేసి అమ్ముతున్నారు. వీరు వాటిని హోం డెలివరీ కూడా చేస్తున్నారు. బల్క్ ఆర్డర్లు తీసుకుని కూడా వాటిని తయారు చేస్తున్నారు. పచ్చళ్లను కేజీకి రూ.400 నుంచి విక్రయిస్తుండగా, పొడులను రూ.90 నుంచి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో తమ సంస్థను మరింత విస్తరిస్తామని వీరు చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయి కూడా ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న వారికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…