గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక చాలా మంది జాబ్లను వెదుక్కునే పనిలో పడతారు. ఉద్యోగం దొరికితే సరే.. లేదంటే ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇక కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా ఉద్యోగాలు దొరకడం ఇంకా కష్టతరమవుతోంది. అయితే ఉద్యోగాలు దొరక్కపోయినా సరే తమ కాళ్లపై తాము నిలబడగలమని ఆ యువతులు నిరూపించారు. స్వయం ఉపాధి ద్వారా చక్కని ఆదాయం సంపాదిస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన డి.రిషి వర్మ, నిజామాబాద్కు చెందిన కె.శ్రీదుర్గలు గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ వుమెన్ లో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ స్టడీస్ (రిటెయిల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ) విద్యను అభ్యసించారు. అయితే గ్రాడ్యుయేషన్ చేశారు కానీ కోవిడ్ వల్ల ఉద్యోగాలు దొరడం లేదు కదా, అందువల్ల ఖాళీగా ఉండడం ఇష్టం లేక సొంతంగా వ్యాపారం మొదలు పెట్టారు. ఫోక్టేల్స్ 22 పేరిట సంస్థను నెలకొల్పారు. దాని సహాయంతో ఊరగాయ పేరిట అనేక రకాల పచ్చళ్లు, పొడులను తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 16న బేగంపేటలో వారు ఊరగాయను నెలకొల్పగా దాంతో పచ్చళ్లు, పొడులను తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత నాణ్యంగా, శుభ్రమైన ప్యాకింగ్తో అత్యంత రుచికరంగా ఉండేలా వాటిని అందిస్తున్నారు. దీంతో వారి పచ్చళ్లు, పొడులకు రెగ్యులర్ కస్టమర్లు ఏర్పడ్డారు. ఈ విధంగా వారు ఇందులో సక్సెస్ సాధించారు.
ప్రస్తుతం వారు www.theuragaya.com అనే వెబ్సైట్ను ఏర్పాటు చేసి అందులో పచ్చళ్లను, పొడులను విక్రయిస్తున్నారు. టమాటా, మామిడి, నిమ్మ, గోంగూర, అల్లం, ఉసిరికాయ, ఎండు మిరప కాయ వంటి పచ్చళ్లను తయారు చేసి అమ్ముతున్నారు. వీరు వాటిని హోం డెలివరీ కూడా చేస్తున్నారు. బల్క్ ఆర్డర్లు తీసుకుని కూడా వాటిని తయారు చేస్తున్నారు. పచ్చళ్లను కేజీకి రూ.400 నుంచి విక్రయిస్తుండగా, పొడులను రూ.90 నుంచి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో తమ సంస్థను మరింత విస్తరిస్తామని వీరు చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయి కూడా ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న వారికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…