సాధారణంగా ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి ఎన్నో విభిన్నమైన లక్షణాలు ఉంటాయి. కొన్ని జంతువులకు వేటాడే గుణాన్ని దేవుడు వరంగా ప్రసాదిస్తే మరి కొన్ని జంతువులకు ఆ క్రూరమృగాల నుంచి తమను తాము సంరక్షించుకునే లక్షణాలను వరంగా ప్రసాదించాడు. ఈ క్రమంలోనే ఎలాంటి క్రూరమృగాల నుంచి అయినా తమను తాము రక్షించుకొని కొన్ని జంతువులు క్రూర జంతువులకు ఓటమిని చూపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది జంతు ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో భాగంగా చిరుత, ఒక ముళ్లపంది మధ్య భయంకరమైన పోరాటం కొనసాగింది. ఈ క్రమంలోనే చిరుత ఎలాగైనా ఆ ముళ్లపందిని చేరుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ముళ్లపంది తన పదునైన ముళ్ళతో ఆ క్రూర మృగాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ముళ్ళ పంది తన పదునైన ముళ్ళు చిరుత పంజాకి గుచ్చడం వల్ల తీవ్ర రక్తస్రావం అయ్యింది.
ఇలా ఈ రెండింటి మధ్య సుమారు 90 నిమిషాల పాటు జరిగిన పోరాటంలో ముళ్ళ పంది చేతిలో చిరుత ఓటమిని చవి చూడక తప్పలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ముళ్ళ పంది తన పదునైన ముళ్ళ ద్వారా ఎలాంటి జంతువు నుంచైనా తనని తాను రక్షించుకోగలదు అంటూ కామెంట్ చేయగా మరికొందరు చిరుత సరైన ఎరను ఎంచుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…